News

ys sharmila sircilla, శవాల మీద రాజకీయం చేయకండి.. షర్మిల ముఖం మీదే చెప్పేసిన నవీన్ కుటుంబసభ్యులు – ys sharmila had an unexpected experience when she went to visit naveen family members


రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆత్మహత్య చేసుకున్న నవీన్ కుటుంబాన్ని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పరామర్శించేందుకు వెళ్లగా.. ఊహించని అనుభవం ఎదురైంది. నవీన్ తల్లిదండ్రులను షర్మిల ఓదార్చి ధైర్యం చెప్తున్న సమయంలో.. వాళ్లు స్పందించిన తీరు అక్కడున్న వాళ్లను అవాక్కయ్యేలా చేసింది. నవీన్ తండ్రి అయితే.. షర్మిల ముఖం మీదే.. నవీన్ విషయంలో ఎలాంటి రాజకీయం చేయకండి అంటూ చెప్పేశాడు. ఆయనతో పాటు నవీన్ బాబాయ్ కూడా స్పందించాడు. తమ అన్నయ్య తన కొడుకును కోల్పోయిన బాధలో ఉంటే.. అటు వార్తల్లో, ఇటు మెస్సేజుల్లో వచ్చిన వార్తలు మరింత క్షోభకు గురి చేస్తున్నాయన్నారు. ఇవన్నీ చూస్తుంటే.. శవాల మీద రాజకీయం చేస్తున్నట్టుగా కన్పిస్తోందన్నారు.

మరోవైపు.. నవీన్ అసలు గ్రూప్-1 కనీసం అప్లై కూడా చేయలేదని తేల్చేశారు. గ్రూప్-1 పేపర్ లీకేజీ కావటం వల్లే మనస్తాపంతో చనిపోయాడంటూ దాంతో లింక్ చేసి వార్తలు తెగ వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు. తమ 30 ఏళ్ల కొడుకు చనిపోవటం పట్ల ఆత్మ క్షోభ అనుభవిస్తుంటే.. ఇలాంటి వార్తల వల్ల మరింత కుంగిపోయే అవకాశం ఉందని చెప్పొకొచ్చారు. ఈ ఊహించని పరిణామంతో.. అటు షర్మిల, ఆమెతో వచ్చిన నేతలంతా సైలెంట్‌ అయిపోయారు.

‘శవాల మీద రాజకీయం చేయకండి.. దయచేసి..’ షర్మిలతో నవీన్ తండ్రి

అనంతరం మీడియా ముందుకొచ్చిన షర్మిల.. ఉద్యోగం దొరకక నవీన్ ఆత్మహత్య చేసుకోవటం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నవీన్ కుటుంబం బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్లని తెలిసినా.. మానవత్వంతో పరామర్శించేందుకు వచ్చినట్టు తెలిపారు. నవీన్ ఆత్మహత్య చేసుకున్నది నిరుద్యోగంతోనే అని షర్మిల తెలిపారు. ఉద్యోగాలు ఇస్తే యువత ఎందుకు సూసైడ్లు చేసుకుంటారని ప్రశ్నించారు. కనీసం ప్రైవేట్ సెక్టార్‌లో అయినా ఉద్యోగాల కల్పన లేదన్నారు. ప్రైవేట్ ఉద్యోగాలను కల్పించి ఉంటే నవీన్‌లాంటి యువకులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని షర్మిల ప్రశ్నించారు.

‘తాతగారూ మీరు ఇంకా ఉన్నారా..’ వీహెచ్‌ను ఆర్జీవీ పుసుక్కున అంతమాట అనేశాడేంటీ..?

  • Read More Telangana News And Telugu News

Related Articles

Back to top button