WPL: జాక్పాట్ కొట్టనున్న మహిళా క్రికెటర్లు.. 5 ఫ్రాంచైజీలు రూ. 4670 కోట్లు.. అత్యధిక బిడ్ వేసింది ఎవరంటే? | BCCI announces five franchises for Women’s Premier League, with combined bid of 4699 crores, know full franchises details
భారత క్రికెట్ నియంత్రణ మండలి సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్ను ప్రకటించింది. లీగ్లోని 5 ఫ్రాంచైజీలను బుధవారం, జనవరి 25న బోర్డు ప్రకటించింది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్ను ప్రకటించింది. లీగ్లోని 5 ఫ్రాంచైజీలను బుధవారం, జనవరి 25న బోర్డు ప్రకటించింది. ఇందులో అహ్మదాబాద్ పేరు మీద అత్యధిక బిడ్ వచ్చింది. అదానీ స్పోర్ట్స్లైన్ అహ్మదాబాద్ ఫ్రాంచైజీని రూ.1289 కోట్లకు కొనుగోలు చేసింది. పురుషుల ఐపీఎల్లోని 7 ఫ్రాంచైజీలలో, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్లను కొనుగోలు చేశాయి. మొత్తంగా ఈ వేలం ద్వారా బీసీసీఐ రూ.4669.99 కోట్లు ఆర్జించింది. అలాగే ఈ లీగ్కు – ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) అని కూడా పేరు పెట్టింది.
𝐁𝐂𝐂𝐈 𝐚𝐧𝐧𝐨𝐮𝐧𝐜𝐞𝐬 𝐭𝐡𝐞 𝐬𝐮𝐜𝐜𝐞𝐬𝐬𝐟𝐮𝐥 𝐛𝐢𝐝𝐝𝐞𝐫𝐬 𝐟𝐨𝐫 𝐖𝐨𝐦𝐞𝐧’𝐬 𝐏𝐫𝐞𝐦𝐢𝐞𝐫 𝐋𝐞𝐚𝐠𝐮𝐞.
లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి
The combined bid valuation is INR 4669.99 Cr
A look at the Five franchises with ownership rights for #WPL pic.twitter.com/ryF7W1BvHH
— BCCI (@BCCI) January 25, 2023
బీసీసీఐ ఈ కొత్త టోర్నమెంట్ కోసం అనేక కంపెనీల నుంచి బిడ్లను స్వీకరించింది. ఈ సంవత్సరం మార్చిలో మొదటిసారి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత బీసీసీఐ బుధవారం 5 అత్యధిక బిడ్డర్ ఫ్రాంచైజీల పేర్లను ప్రకటించింది. ఈ వేలంలో అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీ, లక్నో నగరాలు ఫ్రాంచైజీలను పొందాయి. ఈ ఐదు నగరాల్లో ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఇప్పటికే ఉన్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..