News

vizag police seize money, ఎమ్మెల్సీ ఎన్నికల ఎఫెక్ట్.. భారీగా డబ్బు పట్టివేత – visakhapatnam police seize huge money


ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి నడుస్తోంది. ఈ నెల 13వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలో ఎక్కడ చూసినా రాజకీయ పార్టీల సందడి కనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలన్నీ ముమ్మరం చేశారు.

ఈ క్రమంలో విశాఖపట్నంలో పెద్ద ఎత్తున డబ్బు పట్టుబడటం తీవ్ర కలకలం రేపింది. ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకోజీపాలెంలోని లవకుశ అపార్టుమెంట్‌లో పెద్ద ఎత్తున డబ్బు ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది ఈ క్రమంలో పోలీసులు ఆకస్మికంగా దాడి చేసి పెద్ద ఎత్తున డబ్బు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్న రూ. 26,89,500 నగదు సీజ్ చేశారు.

ఈ సందర్భంగా చోడవరం మండలం బెన్నవోలు గ్రామానికి చెందిన కంచిపాటి రమేష్ నాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ డబ్బు తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడ చిరంజీవికి చెందినదిగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. కాగా, రాష్ట్రంలో ఈ నెల 13వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. 16వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Related Articles

Back to top button