telangana bjp, BJP: టార్గెట్ తెలంగాణ.. బీజేపీ వ్యూహం ఏంటీ..? – target telangana what is bjp strategy
గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని అప్పటినుంచి బీజేపీ వివిధ కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యంగా బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర (Praja Sangrama Yatra) బీజేపీని గ్రామీణ ప్రాంత ప్రజలకు దగ్గర చేసింది. సంజయ్ పాదయాత్ర చేస్తూ.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంతో.. ప్రభుత్వ వ్యతిరేక వర్గం బీజేపీ వైపు చూసింది. ఫలితంగా కొన్నిచోట్ల ప్రజలు సంజయ్ పాదయాత్రకు బ్రహ్మరథం పట్టారు. ప్రజల స్పందన, సంజయ్ పాదయాత్రతో జోష్ మీదున్న బీజేపీ క్యాడర్.. అమిత్ షా ఎంట్రీతో మరింత ఉత్సాహంగా ముందుకెళ్తోంది.
టార్గెట్ తెలంగాణ (Target Telangana) మిషన్ స్టార్ట్ అయ్యాక.. ఎన్నోసార్లు కేంద్ర నాయకత్వం ఓ సంకేతాన్ని బలంగా తెరపైకి తీసుకొచ్చింది. టీఆర్ఎస్ పార్టీపై పోరాడుతున్న బండి సంజయ్, రాష్ట్ర నాయకత్వానికి తాము అండగా ఉన్నామని పలుమార్లు సంకేతాలు ఇచ్చింది. బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ వచ్చి ధైర్యం చెప్పారు. ఇక ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత ముగింపు సభకు అమిత్ షా వచ్చి మరింత ఊపును ఇచ్చారు. ఖమ్మంలో బీజేపీ కార్యకర్త ఆత్మహత్య విషయంలోనూ కేంద్ర నాయకత్వం గట్టిగానే స్పందించింది.
ఇలా సమయం, సందర్భం వచ్చినప్పుడు కేంద్ర నాయకత్వం ఇక్కడి నేతలకు అండగా ఉంటూ వచ్చింది. తెలంగాణలో బలపడాలి అంటే.. ముందు ప్రజలకు నమ్మకం కలిగించాలని అనే వ్యూహాన్ని బీజేపీ పక్కాగా అమలు చేసింది. దీంతో ఇన్నాళ్లు భయపడిన వారు కూడా ఇప్పుడు బయటకు వచ్చి ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఇటీవల భాగ్యనగరంలో నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతోనూ రాష్ట్ర బీజేపీకి తాము అండగా ఉన్నామని మోదీ, అమిత్ షా ద్వయం క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చారు.
తాజాగా.. ఈనెల 21న కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కాయి. మునుగోడు వ్యవహారంపై చర్చ జరుగుతున్న సమయంలో అమిత్ షా ఎంట్రీ ఇవ్వడం పొలిటికల్ హీట్ పెంచుతోంది. అటు రాష్ట్ర బీజేపీ నేతలు కూడా ఎక్కడా తగ్గకుండా.. టీఆర్ఎస్ పార్టీపై దూకుడు పెంచుతున్నారు. కేంద్ర నాయకత్వ తమకు అండగా ఉందని.. ఎలాంటి భయం లేకుండా బీజేపీలో చేరాలని సంకేతాలు ఇస్తున్నారు. ప్రజలకు, నేతలకు నమ్మకం కలిగించడం బీజేపీ వ్యూహాల్లో ఒకటి. దాన్ని సక్సెస్ ఫుల్ గా అమలు చేస్తోంది.