tamil nadu man death, Video: అనూహ్య ఘటన.. సాంబార్ గిన్నెలో పడి వ్యక్తి మృతి – man dies after falling into pot of boiling sambar in madurai in tamil nadu
ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బాధితుడు మద్యం మత్తులో తూలుతూ, గోడ అనుకొని సాంబార్ గిన్నె వైపు వచ్చినట్లు తెలుస్తోంది.
షాకింగ్: సాంబార్ గిన్నెలో పడి వ్యక్తి మృతి
జూలై 29 తమిళనాడు వాసులు రాష్ట్ర వ్యాప్తంగా ‘ఆడివెల్లి’ (Aadi Velli) ఉత్సవాలను ఘనంగా జరుపుకొన్నారు. బోనాల పండగ తరహాలో గ్రామ దేవతల ఉత్సవమిది. మధురైలో పలంగానట్టిలోనూ గ్రామ దేవత ఒడ్డు మారియమ్మ ఉత్సవాలకు గ్రామస్థులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. భక్తులకు అన్నదానం చేసేందుకు పెద్ద ఎత్తున వంటలు చేస్తున్నారు. అదే సమయంలో గ్రామానికి చెందిన ముత్తుకుమార్ (43) అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు.
అన్నదానం కోసం భారీ పాత్రలో సాంబారు చేస్తుండగా.. గోడ అనుకొని దానిపై, కూర్చోబోయి మరుగుతున్న సాంబార్లో పడిపోయాడు ముత్తుకుమార్. అక్కడున్న వారు వెంటనే అప్రమత్తమై అతడిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఆ క్రమంలో కింద ఒలికిన సాంబార్లో కొంత మంది జారిపడ్డారు. మరికొంత మందిపై వేడి వేడి సాంబార్ పడింది. చివరికి సాంబార్ గిన్నెను పొయ్యి మీద నుంచి కిందకు తోసేశాక గానీ.. ముత్తు కుమార్ను రక్షించారు. సాంబార్ గిన్నెను కిందకి బలంగా నెట్టడంతో కొంత మందిపై వేడి వేడి సాంబార్ పడి తీవ్రంగా గాయపడ్డారు.
ముత్తుకుమార్ను రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. 65 శాతం కాలిన గాయాలతో మృత్యువుతో పోరాడుతూ అతడు మంగళవారం (ఆగస్టు 2) మృతి చెందాడు.
Also Read:
✦ కోలుకున్న మంకీపాక్స్ పేషంట్.. 25 రోజుల చికిత్స తర్వాత డిశ్చార్జ్
✦ ఉమామహేశ్వరి మంచి మనసు.. చివరి కోరిక తీర్చిన కుటుంబసభ్యులు