News

ssc hall tickets 2023, పది విద్యార్థులకు అలెర్ట్.. 24 నుంచి హాల్ టికెట్లు.. పరీక్షాకేంద్రాల వద్ద సీసీ కెమెరాలు – telangana tenth class hall tickets 2023 to be available from march 24th


పదో తరగతి విద్యార్థులకు అలెర్ట్. ఏప్రిల్ 3 నుంచి ప్రారంభం కానున్న వార్షిక పరీక్షల కోసం.. హాల్ టికెట్లను ఈ నెల 24 నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పదో తరగతి పరీక్షల నిర్వహణ, అందుకోసం చేసిన ఏర్పాట్లపై విద్యా శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. పరీక్షలు రాసేందుకు వచ్చే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4 లక్షల 94 వేల 616 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం.. మొత్తంగా 2,652 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఎగ్జామ్ సెంటర్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 3 నుంచి ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు టెన్తా క్లాస్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.

మరోవైపు.. తొమ్మిదో తరగతి, పదో తరగతులకు ఇక నుంచి ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. 2022-23 నుంచి ప్రభుత్వం చేసిన కొత్త సంస్కరణలు అమలు అవుతాయని అధికారులు తెలిపారు. ఒక్కో సబ్జెక్ట్‌లో పరీక్షలకు 80, ఫార్మెటివ్‌ అసెస్‌మెంట్‌కు 20 మార్కులు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. సైన్స్‌ పేపర్‌లో ఫిజిక్స్‌, బయాలజీకి సగం సగం మార్కులు ఉండనున్నాయి. సైన్స్‌ పరీక్షకు 3 గంటల 20 నిమిషాల సమయం కేటాయించగా.. మిగతా అన్ని సబ్జెక్టులకు 3 గంటలు పరీక్షా సమయాన్ని కేటాయించారు.

హైదరాబాద్‌లో భారీ వర్షం.. పలు చోట్ల వడగండ్లు.. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి

  • Read More Telangana News And Telugu News

Related Articles

Back to top button