srh no ball controversy, SRH vs LSG: నో బాల్ కాంట్రవర్సీ.. ఫ్యాన్స్ ఆగ్రహంతో నిలిచిన మ్యాచ్ – fans interrupts srh vs lsg match after no ball controversy at uppal
అయితే థర్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయం కూడా వివాదాస్పదంగా మారితే..? అదే ఘటన శనివారం సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) మ్యాచులో జరిగింది. థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది.
అసలేం జరిగిందంటే..
సన్ రైజర్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 19వ ఓవర్ను లక్నో బౌలర్ ఆవేశ్ ఖాన్ వేశాడు. ఆ ఓవర్లో అబ్దుల్ సమద్ ఎదుర్కొన్న 3వ బంతి హై ఫుల్ టాస్గా వెళ్లింది. ఎక్కువ ఎత్తు నుండి బంతి వెళ్తుందని భావించిన ఫీల్డ్ అంపైర్ నోబాల్గా ప్రకటించాడు. అయితే అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ లక్నో రివ్యూకి వెళ్లింది. బంతిని అల్ట్రాఎడ్జ్లో పరిశీలించిన థర్డ్ అంపైర్.. బ్యాటర్ కొద్దిగా వంగి ఉండటంతో.. అది నోబాల్ కాదని ప్రకటించాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంతో క్రీజులో ఉన్న అబ్దుల్ సమద్, క్లాసెన్ షాకయ్యారు. బంతి నడుం పైభాగాన్ని దాటి.. వికెట్ల పై నుంచి ఫుల్ టాస్గా వెళ్లినప్పటికీ అంపైర్ నోబాల్గా ప్రకటించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన SRH ఫ్యాన్స్.. థర్ట్ అంపైర్ను తిట్టడం ప్రారంభించారు. స్టేడియంలోని సీట్లకు ఉండే నట్స్, బోల్టులను పీకి.. లక్నో డగౌట్లోకి విసిరారు.
దీంతో మైదానంలో కాసేపు గందరగోళం నెలకొంది. డగౌట్లోని ఆటగాళ్లంతా లేచి మైదానంలోకి వచ్చారు. ఫలితంగా మ్యాచ్ కూడా కొంచెం సేపు ఆగిపోయింది. తర్వాత అంపైర్లు కలగజేసుకొని పరిస్థితిని చక్కదిద్దారు.
ఫ్యాన్స్ ప్రవర్తించిన తీరు పట్ల సన్ రైజర్స్ ఆటగాడు క్లాసెన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇటువంటి ఘటన మైదానంలో జరగకూడదని అన్నాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంపై కూడా పెద వివిరిచాడు. నోబాల్ విషయంలో థర్డ్ అంపైర్ నిర్ణయంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.