News
Siddipet Road Accident,Siddipet: పరీక్ష రాసి వస్తుండగా ఘోర ప్రమాదం.. ముగ్గురు విద్యార్థులు స్పాట్ డెడ్, 8 మంది సీరియస్ – 3 students spot dead and 8 were serious in siddipet road accident
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే.. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో క్షతగాత్రులను వాహనం నుంచి బయటకు తీసి.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.అయితే.. ఈ విద్యార్థులంతా సిద్దిపేటలోని ఇందూర్ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్నట్టు తెలుస్తోంది. కరీంగనర్లోని తిమ్మాపూర్లో పరీక్షకు హాజరై.. తిరిగి సిద్దిపేటకు వస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారం.
మృతి చెందిన విద్యార్థులు.. నితిన్, గ్రీష్మ, నమ్రతగా పోలీసులు గుర్తించారు. అయితే.. చికిత్స పొందుతున్న మిగతా ఎనిమిది మంది విద్యార్థుల పరిస్థితి సీరియస్గానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.