News
Sattenapalli Janasena Rangoli, వైసీపీ నిర్వహించిన ముగ్గుల పోటీలో ఊహించని పరిణామం.. వీడియో, ఫోటో వైరల్ – janasena party follower rangoli in sattenapalli ysrcp competitions
Authored by Thirumala Babu | Samayam Telugu | Updated: 7 Jan 2023, 1:58 pm
Sattenapalli Janasena Party Rangoli వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలో జనసేన పార్టీ ముగ్గు వేయడం ఆసక్తికరంగా మారింది. ఓ మహిళ జనసేన పార్టీకి అనుకూలంగా ఓ ముగ్గు వేశారు. అందులో జనసేన లోగోతో.. వైసీపీ వద్దు – జనసేన ముద్దు అని కూడా రాశారు. ఇప్పుడు ఈ ముగ్గుకు సంబంధించిన ఫోటో, వీడియో సోషల్ మీడియాలో జనసైనికులు బాగా వైరల్ చేస్తున్నారు.
ప్రధానాంశాలు:
- సత్తెనపల్లిలో వైసీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ
- ఓ మహిళ అక్కడ జనసేన పార్టీ ముగ్గు వేశారు
- ఆమె రాసిన స్లోగన్ ఇప్పుడు వైరల్ అయ్యింది
వైఎస్సార్సీపీ (YSRCP) ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీలు నిర్వహించారని చెబుతున్నారు. ఈ పోటీల్లో జనసేన పార్టీకి అనుకూలంగా ఈ ముగ్గు దర్శనమివ్వటం చర్చనీయాంశంం అయ్యింది. కొందరు ఈ ముగ్గును సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మంత్రి అంబటి రాంబాబును టార్గెట్ చేశారు కొందరు జనసైనికులు. అయితే మంత్రి ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీలు నిర్వహించారనే టాక్ కూడా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో ఫోటోతో పాటూ వీడియో వైరల్ అవుతోంది.
- Read Latest Andhra Pradesh News and Telugu News
సమీప నగరాల వార్తలు
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.