Sankranti, ఇక ఆగేది ఉండదు.. TSRTC బస్సుల్లో సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్ – special line allocation for tsrtc buses at toll plazas on the occasion of sankranti
సంక్రాంతి సందర్భంగా టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ భారీ సంఖ్యలో ప్రత్యేక బస్సులను నడుపుతున్నాయి. అయితే సంక్రాంతికి సొంతూరు వెళ్లే ప్రయాణికులను త్వరగా గమ్యస్థానాలకు చేర్చేందుకు టీఎస్ఆర్టీసీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా టోల్ప్లాజాల వద్ద టీఎస్ఆర్టీసీ బస్సుల కోసం ప్రత్యేక లేన్ ఏర్పాటు చేయాలని కోరుతూ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, తెలంగాణ రోడ్లు, భవనాల శాఖలకు టీఎస్ఆర్టీసీ లేఖ రాసింది. దీనికి ఆ రెండు శాఖలు అంగీకరించడంతో.. టోల్ప్లాజాల వద్ద టీఎస్ఆర్టీసీ బస్సుల కోసం ప్రత్యేక లేన్ కేటాయించనున్నారు.
టోల్ప్లాజా వద్ద సంక్రాంతికి రద్దీ ఎక్కువగా ఉంటుంది. గంటల కొద్ది వేచి ఉండాల్సి ఉంటుంది. టీఎస్ఆర్టీసీకి ప్రత్యేక లైన్ కేటాయించడంతో.. బస్సుల్లో ప్రయాణించేవారికి టోల్ప్లాజాల వద్ద గంటలకొద్ది వేచి ఉండే సమస్య తప్పుతుంది. దీని వల్ల త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. ఈ నెల 12 నుంచి 14వరకు టోల్ప్లాజాల వద్ద టీఎస్ఆర్టీసీ బస్సుల కోసం ప్రత్యేక లైన్ కేటాయించనున్నారు. అన్ని టోల్గేట్ల వద్ద మూడు షిప్ట్ల్లో సిబ్బందిని ఆర్టీసీ అందుబాటులో ఉంచనుంది. టోల్ప్లాజాల వద్ద ఆర్టీసీ బస్సులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక లేన్ వద్ద త్వరగా పంపించేలా చర్యలు చేపడతారు.
ప్రైవేట్ వెహికల్స్లో వెళ్లి టోల్ప్లాజాల వద్ద ఇబ్బంది పడే బదులు.. ఆర్టీసీ బస్సుల్లో త్వరగా మీ ప్రాంతాలకు చేరుకోండి అంటూ ప్రజలకు టీఎస్ఆర్టీసీ సూచిస్తోంది. సంక్రాంతికి టీఎస్ఆర్టీసీ గత ఏడాది కంటే ఈ సారి ప్రత్యేక బస్సుల సంఖ్యను మరింత పెంచింది. 4,233 బస్సులను ఇప్పుడు నడపనుంది. అటు ఏపీఎస్ఆర్టీసీ 6400 ప్రత్యేక బస్సులను సంక్రాంతికి నడపనుంది. అటు రైల్వేశాఖ కూడా సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా భారీ సంఖ్యలో ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతోంది. వీటిల్లో హైదరాబాద్ నుంచి ఏపీకి ఎక్క కేటాయించారు. ముందుగా బస్సుల్లో అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. ప్రత్యేక బస్సుల ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోన్నాయి. గతంలో కంటే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని పెంచుకునేందుకు రెడీ అయ్యాయి.
- Read More Telangana News And Telugu News