News
Rekha Nayak,నాకు చేసింది చాలదన్నట్టు నా బిడ్డకూ అన్యాయం చేశారు.. కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే – khanapur brs mla rekha nayak emotiional comments on cm kcr
అయితే.. నేడు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే పనిచేస్తున్నానన్న రేఖనాయక్.. ఏసీడీపీ నిధులు ఆపారని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు, రోడ్ల పనులు కూడా ఆపారని.. నిధులు రాకుండా నిలిపి వేశారని అసహనం వ్యక్తం చేశారు. అభివృద్ధి కార్యక్రమాల కోసం తాను నిధులు అడిగితే కాంగ్రెస్ పార్టీ అంటున్నారన్నారు. పార్టీ మారింది తన భర్త మాత్రమేనని.. తాను కాదంటూ స్పష్టం చేశారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బీఆర్ఎస్తో ఉంటే.. ఆయన తండ్రి మాత్రం సీపీఐ పార్టీలో పనిచేయడం లేదా అని ప్రశ్నించారు. తనకు చేసిన అన్యాయం చాలదన్నట్లు తన బిడ్డకు కూడా అన్యాయం చేశారంటూ కార్యకర్తల దగ్గర భోరున విలపించారు. కావాలనే తన అల్లున్ని(ఐపీఎస్) బదిలీ చేశారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు రేఖా నాయక్.
తాను తెలంగాణ ఉద్యమంలో పని చేశానని.. నియోజకవర్గం కోసం పని చేశానంటూ చెప్పుకొచ్చారు. తొమ్మిదేళ్లుగా ఎమ్మెల్యేగా సేవలందిస్తున్నానని చెప్పుకొచ్చారు. అభ్యర్థి కోసం అభివృద్ధి ఆపడం సరికాదన్నారు. ఇలాంటి ధోరణి ఉంటే ప్రభుత్వం వెంటనే మార్చుకోవాలని ఎమ్మెల్యే రేఖా నాయక్ హెచ్చరించారు.