News

rbi rule violations, రూల్స్ తప్పితే RBI ఊరుకుంటుందా మరి? HDFCకి కర్రు కాల్చి వాత పెట్టింది! – rbi imposes monetary penalty on hdfc and igh holdings for rule violations


RBI:రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ శుక్రవారం మార్చి 17న దేశంలోని ప్రైవేటు రంగ దిగ్గజ ఫైనాన్షియల్ సంస్థ హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (HDFC)పై మానిటరీ పెనాల్టీ (Monetary Penalty) విధించింది. ఆర్‌బీఐలోని పలు నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించి రూ.5 లక్షల జరిమానా వేసింది. ఈ కంపెనీలో నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నిర్వహించిన తనిఖీల్లో 2019-20 ఆర్థిక ఏడాదికి సంబంధి పలు మెచ్యూరిటీ పూర్తయిన డిపాజిట్లను ఆయా డిపాజిటర్లకు ట్రాన్స్‌ఫర్ చేయడంలో కంపెనీ విఫలమైనట్లు గుర్తించామని ఆర్‌బీఐ పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించినందుకు జరిమానా చెల్లించాలని స్పష్టం చేసింది.

ఈ విషయంపై ముందుగానే హెచ్‌డీఎఫ్‌సీ (Housing Development Finance Corporation Limited) కంపెనీకి నోటీసులు జారీ చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మెచ్యూరిటీ పూర్తయిన డిపాజిట్లు ట్రాన్స్‌ఫర్ చేయకపోవడంతో జరిమానా ఎందుకు విధించకూడతో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు ఆర్‌బీఐ తెలిపింది. అయితే, కంపెనీ ఇచ్చిన సమాధానం సరిగా లేనందునే జరిమానా విధించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. అందులో భాగంగానే నిబంధనల ఉల్లంఘనల కింద రూ.5 లక్షలు మానిటరీ పెనాల్టీ వేసినట్లు స్పష్టం చేసింది. ఇది కేవలం రెగ్యూలేటరీ నిబంధనలను పాటించకపోవడానికి మాత్రమే సంబంధించినదని, ఏ ట్రాన్సాక్షన్లను, అగ్రిమెంట్లను అధికారికంగా ధ్రువీకరించడానికి మాత్రం కాదని స్పష్టం చేసింది.

మరో కంపెనీపైనా మానిటరీ పెనాల్టీ..
ముంబాయికి చెందిన ఐజీహెచ్ హోల్డింగ్స్ ప్రైవేటు లిమిటెడ్ (IGH Holdings) నిబంధనలు ఉల్లంఘించిన క్రమంలో రూ.11.25 లక్షలు పెనాల్టీ విధించినట్లు ఓ ప్రకటన విడుదల చేసింది ఆర్‌బీఐ. 2020-21 ఆర్థిక ఏడాదికి సంబంధిచి రిసర్వ్ ఫండ్స్‌పై నెట్ ప్రాఫిట్స్‌లోని 20 శాతం తమ కస్టమర్లకు తర్జుమా చేయడంలో నిర్లక్ష్యం వహించినట్లు గుర్తించిన క్రమంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అలాగే సీఐసీకి కూడా ఎలాంటి క్రెడిట్ సమాచారాన్ని అందించలేదని పేర్కొంది. ఈ క్రమంలోనే కంపెనీకి నోటీసులు ఇచ్చామని, దానిపై సమాధానం ఇచ్చిన తర్వాతే నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు నిర్ధారించి పెనాల్టి వేసినట్లు స్పష్టం చేసింది.

ఇటీవలి కాలంలో నిబంధనలు ఉల్లంఘిస్తూ అవకతవకలకు పాల్పడుతున్న బ్యాంకులు, పైనాన్షియల్ కంపెనీలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొరడా ఝుళిపిస్తోంది. ఇటీవలే మధ్య ప్రదేశ్‌లోని ఓ కోఆపరేటివ్ బ్యాంక్ దివాలా తీయడంతో దాని లైసెన్స్ రద్దు చేసింది. ఆ తర్వాత మరో 5 కోఆపరేటివ్ బ్యాంకులపై ఆంక్షలు విధించింది. అలాగే నాలుగు రోజుల క్రితంలో దేశంలోని 17 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ రద్దు చేసింది. వాటి నుంచ సీఓఆర్‌ను స్వాధీనం చేసుకుంది.

  • Read Latest Business News and Telugu News

కొరడా ఝుళిపించిన RBI.. 17 నాన్ బ్యాంకింగ్ సంస్థల లైసెన్స్ రద్దు.. కారణం ఏమిటి?బ్యాంక్ కస్టమర్లకు RBI ఝలక్.. వచ్చే నెల నుంచి EMIలు ఎక్కువ కట్టాల్సిందే..!SVB Crisis: సీఈఓ షేర్లు అమ్మేసిన 10 రోజులకే ‘బ్యాంక్’ దివాలా.. అన్నీ తెలిసే చేశారా?

Related Articles

Back to top button