Entertainment

2018 Movie: ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ హిట్ 2018… క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్..


ఇక ఇటీవల మలయాళంలో ప్రభంజనం సృష్టించిన సినిమా 2018. విడుదలైన మొదటిరోజునే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహకందని రీతిలో కలెక్షన్స్ వసూలు చేస్తోంది. డైరెక్టర్ ఆంటోని జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కావ్య ఫిల్మ్ బ్యానర్ పై నిర్మించారు.

ఇటీవల ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంటున్నాయి పలు చిత్రాలు. కాంతార, బలగం వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సెన్సెషన్ గురించి చెప్పక్కర్లేదు. స్టార్ హీరోహీరోయిన్స్ లేకుండానే ఆడియన్స్ ముందుకు వచ్చి భారీగా వసూళ్లు రాబట్టాయి. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డ్స్ అందుకున్నాయి. ఇక ఇటీవల మలయాళంలో ప్రభంజనం సృష్టించిన సినిమా 2018. విడుదలైన మొదటిరోజునే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహకందని రీతిలో కలెక్షన్స్ వసూలు చేస్తోంది. డైరెక్టర్ ఆంటోని జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కావ్య ఫిల్మ్ బ్యానర్ పై నిర్మించారు.

మే 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. విడుదలైన పది రోజుల్లోనే రూ. 44 కోట్లకు పైగా గ్రాస్ అందుకుంది. దేశవ్యాప్తంగా మొత్తం రూ. 52.20 కోట్లు రేంజ్ గ్రాస్ సొంతం చేసుకుంది. 11 రోజుల్లోనే 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. టోవినో థామస్, కుంచకో బోబన్, కళ్యాణ్ అరసన్, అపర్ణ బాలమురళి, తన్వీ రామ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఇవి కూడా చదవండి



ఇదిలా ఉంటే.. ఈ సినిమాను ఇప్పుడు తెలుగులోకి తీసుకువస్తున్నారు. ఈనెల 26న ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ జరిగింది. గీతా ఆర్ట్స్ 2 సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ వచ్చేవారం ఓటీటీలోకి రానుందనే ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలపై స్పందించారు ప్రొడ్యూసర్ బన్నీవాసు. 2018 మూవీ నేరుగా థియేటర్లలోకి రాబోతుందని.. ఓటీటీలోకి కాదని తెల్చీ చెప్పారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button