News
ponguleti srinivas reddy, పొంగులేటి అనుచరులపై బీఆర్ఎస్ చర్యలు.. 20 మందిపై సస్పెన్షన్ వేటు – brs party suspended 20 followers of ponguleti srinivas reddy in vyara constituency
ఈ క్రమంలోనే.. వైరా నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు, పొంగులేటి అనుచరులు ఆయనను కలవడానికి వెళ్లారు. ఇప్పటికే పొంగులేటిపై గుర్రుగా ఉన్న అధిష్ఠానం.. ఈ విషయం తెలియటంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. పొంగులేటి వర్గంపై బీఆర్ఎస్ బహిష్కరణ వేటు వేసింది. వైరా నియోజకవర్గంలోని 20 మంది నాయకులపై బీఆర్ఎస్ చర్యలు తీసుకుంది. రాష్ట్ర మార్క్ఫెడ్ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్ను పార్టీ నుంచి బహిష్కరించింది. వైరా పురపాలక ఛైర్మన్ జైపాల్తో పాటు ఇతర 18 మంది నాయకులను పార్టీ సస్పెండ్ చేసింది.
అయితే.. గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై బహిరంగంగానే విమర్శలు చేస్తూ తన అక్కస్సు వెళ్లగక్కుతున్న పొంగులేటి.. మండల స్థాయి నాయకులతో మంతనాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం దాదాపు 5 మండలాల నేతలు పొంగులేటితో భేటీ అయ్యారు. పలువురు ముఖ్య నేతలు, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొనడంపై అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పొంగులేటితో సమావేశమైన నేతలను సస్పెండ్ చేస్తున్నట్లు ఆయా మండల పార్టీ అధ్యక్షులు ప్రకటించారు.
- Read More Telangana News And Telugu News