News

Pm Vishwakarma Scheme,5 శాతం వడ్డీకే లక్ష లోన్, తర్వాత 2 లక్షలు.. రూ.15 వేలు సాయం.. కేంద్రం కొత్త స్కీం.. అర్హులు ఎవరెవరంటే? – pm modi launches pm vishwakarma, check eligibility, how to apply full details here


PM Modi Launches PM Vishwakarma Scheme: కేంద్ర ప్రభుత్వం నుంచి కొత్త పథకం ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ తన పుట్టినరోజు నాడే.. అలాగే విశ్వకర్మ జయంతి సందర్భంగానే.. పీఎం విశ్వకర్మ స్కీంను లాంఛ్ చేశారు. ఈ పథకం కింద మొత్తంగా 18 రకాల సంప్రదాయ చేతివృత్తిదారులకు పరికరాల కోసం రూ. 15 వేలు ఆర్థిక సాయం అందించడం సహా పనిలో నైపుణ్యం పెంచుకునేందుకు తగిన శిక్షణ ఇచ్చి రోజుకు రూ. 500 చొప్పున ఉపకార వేతనం కూడా ఇవ్వనుంది కేంద్రం. శిక్షణ తర్వాత వడ్డీల్లో రాయితీతో బ్యాంక్ లోన్ కూడా వస్తుంది.

5 శాతం వడ్డీకే ఇక్కడ వీరికి లోన్లు అందుతాయని చెప్పొచ్చు. దీని కోసం తొలి విడతగా కేంద్ర ప్రభుత్వం రూ. 13 వేల కోట్ల నుంచి 15 వేల కోట్ల రూపాయల వరకు వెచ్చించనుంది. దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని సంప్రదాయ వృత్తుల్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రం ఈ స్కీం లాంఛ్ చేసింది.

చేతివృత్తులు నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న వారి కోసం ఈ స్కీం కింద రెండు శిక్షణ కార్యక్రమాలను తీసుకొస్తుంది. దీనికి దరఖాస్తు చేసుకున్నావారికే రోజుకు రూ. 500 స్టైఫండ్‌తో మెరుగైన శిక్షణ ఇచ్చి.. తర్వాత పరికరాల కొనుగోలు కోసం రూ. 15 వేలు ఆర్థికసాయంగా అందిస్తుంది.

  • స్టాక్స్, మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఈ పని చేయకుంటే డీమ్యాట్ అకౌంట్ క్లోజ్!

  • ఈ స్కీం ఏదో బాగుందే.. స్లీపర్ క్లాస్ టికెట్‌తోనే ఫ్రీగా థర్డ్ ఏసీ ప్రయాణం.. ఎలాగంటే?

లోన్ ఎలా అంటే?

ఆ తర్వాత వడ్డీపై భారీ రాయితీతో బ్యాంక్ లోన్ వస్తుంది. తొలి విడతను సద్వినియోగం చేసుకున్న వారికి రెండో విడతలో భాగంగా రూ. 2 లక్షల వరకు లోన్ వస్తుంది.
కళాకారులు తమ నైపుణ్యాలను మరింత అప్‌గ్రేడ్ చేసుకోవడం, టూల్‌కిట్ ఇన్సెంటివ్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్, మార్కెటింగ్‌ను ప్రోత్సహించేందుకు వీలుగా ఈ లోన్లు మంజూరు చేస్తారు.

అర్హులు వీళ్లే..

ఈ స్కీంతో ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన సంప్రదాయ కళాకారులు, చేనేతకారులు, వడ్రంగులు, క్షురకులు, రజకులు, స్వర్ణకారులు, పడవలు తయారు చేసేవారు, ఆయుధాలు తయారు చేసేవారు, కమ్మరి, ఇనుప పరికరాలు తయారు చేసేవారు, ఇంటి తాళాలు తయారుచేసేవారు, కుమ్మరి (కుండలు తయారు చేసేవారు), విగ్రహాల తయారీదారులు, చర్మకారులు (చెప్పులు తయారుచేసేవారు), తాపీ పనిచేసేవారు (రాజ్‌మిస్త్రీ), బాస్కెట్/మ్యాట్/నారతాళ్లు తయారుచేసేవారు, సంప్రదాయ బొమ్మలు చేసేవారు, పూలదండలు తయారుచేసేవారు, దర్జీలు, చేప వలల తయారీదారులు అర్హులు. దాదాపు 30 లక్షల మంది హస్త కళాకారులు, వారి కుటుంబాలకు ఈ విశ్వకర్మ పథకంతో లబ్ధి చేకూరనుంది.
సర్టిఫికెట్, ఐడీ కార్డ్స్ ద్వారా పీఎం విశ్వకర్మ పథకానికి ఆయా వర్గాల నుంచి అర్హులను గుర్తిస్తారు.

RBI కొత్త రూల్.. రూ. 50 లక్షల హోం లోన్‌పై రూ. 33 లక్షల వడ్డీ ఆదా.. ఎలాగో తెలుసా?

క్రెడిట్ కార్డు వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. మీరు వాడుతున్నారా? ఇదే జరిగితే మాత్రం..

Advertisement

Read Latest Business News and Telugu News

Related Articles

Back to top button