Pig: ఆత్మరక్షణకై పంది ఒంటరి పోరాటం.. వ్యక్తి మృతి! ఆ తర్వాత ఏం జరిగిందంటే.. | Pig allegedly kills butcher in Hong Kong slaughter house
తనను చంపేందుకు యత్నించిన వ్యక్తిపై పెంపుడు పంది తిరగబడి దాడి చేసింది. ముందుగా కసాయి ఎలక్ట్రిక్ గన్తో పందిని పడగొట్టాడు. ఐతే అనూహ్యంగా స్పృ హలోకి వచ్చిన పంది కసాయిపై దాడి చేసింది. ఈ ప్రమాదంలో 61 ఏళ్ల వ్యక్తి తీవ్రగాయాలపాలై ప్రాణాలు..
తనను చంపేందుకు యత్నించిన వ్యక్తిపై పెంపుడు పంది తిరగబడి దాడి చేసింది. ఈ షాకింగ్ ఘటన చైనాలో చోటు చేసుకుంది. ముందుగా కసాయి ఎలక్ట్రిక్ గన్తో పందిని పడగొట్టాడు. ఐతే అనూహ్యంగా స్పృ హలోకి వచ్చిన పంది కసాయిపై దాడి చేసింది. ఈ ప్రమాదంలో 61 ఏళ్ల వ్యక్తి తీవ్రగాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు. హాంకాంగ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పందిని చంపేందుకు యత్నించిన వ్యక్తి అనుమానాస్పద రీతిలో గత శుక్రవారం (జనవరి 20)న మృతి చెందాడు. మృతుడు (61) హాంకాంగ్లోని షెంగ్ షుయ్ స్లాటర్హౌస్లోని కబేళాలో కసాయిగా పని చేసేవాడు. ఎప్పటి మాదిరిగానే శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు ఓ పందిని ఎలక్ట్రిక్ గన్తో పంది స్పృహ తప్పేలా చేశాడు. కింద పడిపోయిన పంది కొద్ది సేపటికే తేరుకుని కసాయిపై దాడి చేసింది. దీంతో సదరు వ్యక్తి తనచేతిలోని ఒకటిన్నర అడుగుల పొడవాటి కొడవలితో పందిని పొడిచాడు. అతని కాలిపై దాదాపు 15 అంగుళాల మేర గాయం చేసింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న బాధితుడిని సహోద్యోగి గమనించి సమీప ఏరియా ఆసుపత్రికి తరలించాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. వ్యక్తి మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆ ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరణించిన కార్మికుడి కుటుంబాన్ని ఆదుకుంటామని కార్మిక శాఖ ప్రకటించింది. ఈ ఘటనపై త్వరలోనే విచారణ పూర్తి చేసి మృతికి గల కారణాలను వెలికితీస్తామని పోలీసులు తెలిపారు.
లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.