News

national list of medicines 2022, ఆ ట్యాబ్లెట్లతో క్యాన్సర్ ముప్పు ?.. జాబితా నుంచి 26 ఔషధాలు తొలగింపు – anti cancer drugs and antibiotics to become more affordable


NLEM 2022: కేంద్ర ప్రభుత్వం జాతీయ అత్యవసర ఔషధాల జాబితాను విడుదల చేసింది. అయితే ఇందులో చాలా మార్పులు, చేర్పులు చేసింది. ఈ జాబితాలో మొత్తం 384 మందులు ఉండగా.. 34 ఔషధాలను కొత్తగా చేర్చారు. అదే సమయంలో ఇక రనిటైడిన్ సహా 26 ఔషధాలను అత్యవసర మందుల జాబితా నుంచి తొలగించారు. అయితే క్యాన్సర్ నిరోధక మందులు, యాంటీ బయాటిక్‌లు, టీకాలు ఇప్పుడు మరింత చౌకగా దొరుకుతాయని, ప్రజల మందు ఖర్చు తగ్గుతుందని కేంద్రం వెల్లడించింది.

ఈ ఔషధాల కొత్త జాబితాను కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎండోక్రైన్‌ మందులు, ఇన్సులిన్‌ గ్లార్గిన్‌, ఐవర్‌మెక్టిన్‌ వంటి 34 రకాల మందులను కొత్తగా జాబితాలో చేర్చారు. రనిటైడిన్‌, సక్రాల్‌ఫేట్‌, అటినోలాల్‌ వంటి 26 రకాల ఔషధాలను తొలగించారు.

తగ్గనున్న మందుల ధర…
“నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ 2022ని విడుదల చేసింది. ఇందులో 27 విభాగాల్లో 384 మందులు ఉన్నాయి. అనేక యాంటీ బయాటిక్స్, వ్యాక్సిన్లు, యాంటీ క్యాన్సర్ మందులు. అనేక ఇతర ముఖ్యమైన మందులు మరింత చౌకగా దొరుకుతాయి. సరసమైన.. నాణ్యమైన ఔషధాల లభ్యతను నిర్ధారించడంలో నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ (NLEM) ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఖర్చులను తగ్గించడానికి దోహదం చేస్తుంది.” అని మన్‌సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు.

140 సార్లు చర్చలు…
అదేవిధంగా 2015 తర్వాత జాతీయ అత్యవసర ఔషధాల జాబితాను ఇప్పుడే అప్‌డేట్ చేశామని, 350 మందికి పైగా నిపుణులతో 140 సార్లు చర్చలు జరిపి ఈ జాబితాను తయారు చేసినట్టు కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలియజేశారు. ఈ జాబితా తయారీలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలియజేశారు.

క్యాన్సర్ కారకాలు..?
ఇక అత్యవసర జాబితా నుంచి తొలగించిన అసిలాక్‌, జిన్‌టాక్‌, రాంటాక్‌ ఔషధాలను ఎసిడిటీ, కడుపునొప్పి సంబంధిత సమస్యలకు సూచిస్తుంటారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా అమ్ముడయ్యే మందులు ఇవి. అయితే ఈ ట్యాబ్లెట్లలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని 2019లో అమెరికా పరిశోధన ఒకటి వెల్లడించింది. దీంతో అప్పటి నుంచి ఆ ట్యాబ్లెట్ల వినియోగంపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. బహుశా ఈ కారణం చేతే తాజాగా అత్యవసర ఔషధాల జాబితా నుంచి దీన్ని తొలగించి ఉండ వచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అప్పట్లో ఈ విషయం చాలా చర్చనీయాంశం అయింది. ఈ మందులు ప్రజలకు మంచిదా..? కాదా..? అని గందరగోళంలో పడిపోయారు. మళ్లీ ఇప్పుడు కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం.. ఆ అనుమానాలను మరింత బలపడుతున్నాయి.

Read Also:హింసాత్మకంగా నిరసనలు… లేడీ కిమ్ అంటూ దీదీపై బీజేపీ విమర్శలు

Related Articles

Back to top button