News
nara lokesh, పెట్రోల్ లేదన్నందుకు దళిత యువకుడిపై వైసీపీ నేత దాడి.. జగన్ సర్కారుపై లోకేష్ ఫైర్ – tdp leader nara lokesh fires on ap government due to attack on dalith man
దళితులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దమనకాండ కొనసాగుతూనే ఉందని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. పెట్రోల్ బంక్లో సర్వర్ పనిచేయని కారణంగా పెట్రోల్ కొట్టడం కుదరదన్నందుకు దళిత యువకుడు తేజపై బొడిగుడిపాడు వైసీపీ ఎంపీటీసీ మహేష్ నాయుడు అత్యంత దారుణంగా అనుచరులతో కలిసి దాడి చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం రాత్రి లోకేష్ వరుస ట్వీట్లు చేశారు. అలాగే, ఓ వీడియోను కూడా షేర్ చేశారు.
‘‘దళితులపై వైసీపీ నేతల దమనకాండ కొనసాగుతూనే ఉంది. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం, దగదర్తి మండలం, ఉలవపాళ్ళ పెట్రోల్ బంక్ లో సర్వర్ పనిచేయని కారణంగా పెట్రోల్ కొట్టడం కుదరదు అన్నందుకు దళిత యువకుడు తేజపై అత్యంత దారుణంగా అనుచరులతో కలిసి దాడి చేశాడు బొడిగుడిపాడు వైసిపి ఎంపీటీసీ మహేష్ నాయుడు.
కాళ్ళతో తన్ని, ఇనుప రాడ్డుతో తేజని తీవ్రంగా గాయపరిచారు. దళిత యువకుడుపై దాడి చేసిన ఎంపీటీసీ మహేష్ నాయుడు, అతని అనుచరులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చెయ్యాలి. గాయపడిన తేజకి మెరుగైన వైద్యం అందించి ఆదుకోవాలి.’’ అని నారా లోకేష్ పేర్కొన్నారు.