nara lokesh, జగన్ రెడ్డి అలా అనే అవకాశమే లేదు.. అన్నీ రికార్డెడ్గా ఉన్నాయ్: లోకేష్ – nara lokesh fires on ap cm ys jagan over electricity employees
సీఎం జగన్మోహన్ రెడ్డి మోసపూరిత హామీలిచ్చి, అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటిపోయిందని నారా లోకేష్ అన్నారు. విద్యుత్ కాంట్రాక్టు కార్మికులకు ఇచ్చిన హామీని ఇప్పటికైనా గుర్తుకు తెచ్చుకొని నెరవేర్చేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. దశాబ్దాల కాలంగా ఏపీ ట్రాన్స్కో, జెన్ కో, డిస్కంల్లో 26 వేల మంది కాంట్రాక్టు కార్మికులు ఉద్యోగ భద్రత లేకుండా పనిచేస్తున్నారని చెప్పారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మీ అడుగులో అడుగేసి మీ వెంట నడిచిన వారిని సీఎం అయ్యాక విస్మరించడం సరికాదని విమర్శించారు. తెలంగాణలో కాంట్రాక్టు కార్మికులను విద్యుత్ సంస్థలో విలీనం చేసుకుని ప్రొబేషనరీ కాలం ముగిశాక 24 వేల మందికి పైగా కార్మికులను రెగ్యులర్ చేశారని.. అర్హత వయస్సు దాటిపోతుందని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారని లోకేష్ లేఖలో పేర్కొన్నారు.