News

nadendla manohar, సమాజంలో కుల వివక్ష, అసమానతలు ఎన్నో ఏళ్లుగా ఉన్నాయి: నాదెండ్ల మనోహర్ – janasena leader nadendla manohar comments on sc st sup plan


జగన్ ప్రభుత్వానికి ప్రజలకు మేలు‌ చేసే ఆలోచనే లేదని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పాట్లు పడుతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోదన్నారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ‘ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ – వైసీపీ సర్కార్’ నిర్లక్ష్యంపై రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ న్యాయబద్ధంగా రావాల్సిన హక్కుల కోసం పోరాడాలన్నారు. జనసేన ఎప్పుడూ జనం పక్షానే నిలబడిందని.. భవిష్యత్తులోనూ నిలబడుతుందన్నారు.

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పూర్తిగా అమలు చేస్తే అందరికీ ఉపయోగ పడుతుందని నాదెండ్ల మనోహర్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి నిజంగా‌ చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నించారు. ఆర్డినెన్స్ తీసుకురావడం ద్వారా పూర్తిగా అమలైపోతుందా అని నిలదీశారు. ఈ నాలుగేళ్ల కాలంలో ‌జగన్ ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది.. ఎంత మంది ఆర్థిక‌ ప్రగతి సాధించారని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను పొడిగించడం కాదని.. పూర్తి స్థాయిలో అమలు‌ చేసేలా చూడాలన్నారు.

సమాజంలో కుల వివక్ష, అసమానతలు ఎన్నో దశాబ్దాలుగా ఉంటూనే ఉన్నాయని నాదెండ్ల మనోహర్ అన్నారు. రాజకీయ వ్యవస్థలో ఎవరైనా అభిప్రాయాలు వెలిబుచ్చే అవకాశం ఇవ్వకపోతే ఎలాగని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పూర్తిగా అమలు చేసి, నిధులిస్తే వాటి ఫలితాలు అద్భుతంగా ఉంటాయని వివరించారు. అందరికీ వీటిపై అవగాహన కల్పించి, అభిప్రాయాలు పంచుకోవాలనే ఈ సదస్సు ఏర్పాటు చేశామన్నారు. అన్ని పట్టణాలు, పల్లెల్లో తిరిగి వారి హక్కుల గురించి వివరించాలన్నారు.

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు జగన్ ప్రభుత్వం 60 శాతం కూడా నిధులు ఇవ్వకుండా దారి మళ్లించారని నాదెండ్ల మనోహర్ ఫైరయ్యారు. బడుగు, బలహీన వర్గాలకు సమాన హక్కులు, అధికారాలు కల్పించాలన్నారు. ప్రతి ఏడాది నిధుల‌ వినియోగంపై చర్చ జరగాలని, ఆడిట్ చేయాలన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచులకు ఇచ్చే నిధులు కూడా లాగేశారని పేర్కొన్నారు. నేడు‌ ఒక‌ వీధి లైటు పోయినా వేయలేని దుస్థితిలో సర్పంచులు ఉన్నారన్నారు.

Related Articles

Back to top button