News

Mukesh Ambani,Reliance: రిలయన్స్‌ను వీడుతున్న ఉద్యోగులు.. ఏడాదిలో 1.67 లక్షల మంది ఔట్.. ఏం జరుగుతోంది? – reliance industries sees uptick in employee attrition shows ril annual report


Reliance: రిలయన్స్ ఇండస్ట్రీస్.. దేశంలోనే అతిపెద్ద వ్యాపార సంస్థగా అందరికి తెలిసింది. అపర కుబేరుడు ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఈ కంపెనీ అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థల్లో లక్షల మంది పని చేస్తున్నారు. అయితే, ఇప్పుడు రిలయన్స్ కంపెనీల్లో ఉద్యోగుల రాజీనామాలు పెరగడం షాకింగ్ విషయంగా చెప్పవచ్చు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు అంబానీ కంపెనీలను వీడుతున్నారు. 2022-23 ఆర్థిక ఏడాదిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ను వీడిన ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రిలయన్స్ టెలికాం విభాగం జియోలో 41, 818 మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామా చేసి వెళ్లిపోయారు. రిలయన్స్ రిటైల్ విభాగంలో 1,19, 229 మంది మంది ఉద్యోగాలకు రాజీనామా చేశారు. మొత్తంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లో ఒక్క ఏడాదిలోనే 1,67,391 మంది ఉద్యోగులు వైదొలిగడం గమనార్హం. ఈ వివరాలను రిలయన్స్ తన వార్షిక నివేదికలో వెల్లడించింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇటీవలి కాలంలో పలు స్టార్టప్ కంపెనీలను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీంతో కంపెనీ కార్యకలాపాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారి రోల్స్ ఒకే విధంగా ఉన్నాయి. దీంతో కొందరు ఉద్యోగులు కంపెనీ వీడి వేరే జాబ్ వెతుక్కున్నారు. మరికొందరు ఇదే కంపెనీలోని వేరే విభాగంలో కొత్త రోల్స్‌లోకి మారారు. ఉద్యోగ నియమాకాలు ఎక్కువగా జరిగినప్పుడు చాలా మంది వేరే కంపెనీలో మంచి జాబ్ చూసుకుని రాజీనామా చేశారు. దీంతో రిలయన్స్ అట్రిషన్ రేటు అంతకు ముందు ఏడాదితో పోల్చితే 64.8 శాతం పెరిగింది.

జియోలో 41 వేల మంది ఔట్..
రిలయన్స్ జియోలో ఏడాదిలో మొత్తం 41,818 మంది ఉద్యోగులు రాజీనామా చేశారు. రిలయన్స్ రిటైల్‌లో చూస్తే ఆ సంఖ్య మూడింతలు ఉంది. మొత్తంగా 1,19,229 మంది ఉద్యోగులు రాజీనామా చేశారు. దీంతో మొత్తంగా కంపెనీని వీడిన వారి సంఖ్య 1.67 లక్షలుగా ఉంది. రాజీనామా చేసిన వారిలో ఎక్కువ మంది జూనియర్ స్థాయి నుంచి మిడ్ మేనేజ్‌మెంట్ స్థాయి సిబ్బందే ఉన్నారు. మరోవైపు.. ఖర్చులు తగ్గించే ప్రక్రియలో రిలయన్స్ కొంత మంది ఉద్యోగులను స్వచ్ఛందంగా తప్పుకోమని చెప్పినట్లు సమాచారం.

పెరిగిన నియామకాలు..
కంపెనీలో ఉద్యోగుల రాజీనామాలు పెరిగినా మరోవైపు కొత్త నియమాకాలు కూడా భారీగా చేపట్టింది రిలయన్స్. 2023 ఆర్థిక సంవత్సరంలో 2,62,558 మంది ఫ్రెషర్స్ ను వివిధ విభాగాల్లో నియమించుకుంది. ఈ ఏడాది మే నెలలో కాస్ట్ కటింగ్‌లో భాగంగా ఈ-కామర్స్ విభాగం జియో మార్ట్ 1,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. మరోవైపు రిలయన్స్ 46 వ వార్షిక సదస్సు ఆగస్టు 28 న మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది. కంపెనీ ఛైర్మన్ ముకేశ్ అంబానీ తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడతారు.

  • Read Latest Business News and Telugu News

IT Employees: ఐటీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ భయమే లేదు.. లేఆఫ్స్ జరిగినా వీళ్లు సేఫ్! Mukesh Ambani: ఆ లగ్జరీ ఇల్లు అమ్మేసిన రిలయన్స్ బాస్ అంబానీ.. ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా? సెక్షన్ 80 C లిమిట్ పెరుగుతుందా? అందరి డిమాండ్ అదే.. కేంద్రం సమాధానం ఇదిగో..

Related Articles

Back to top button