News

Mokila Plots Auction,మోకిలా భూముల వేలంలో ట్విస్ట్.. డబ్బులు కట్టని 10 మంది బిడ్డర్లు.. ప్లాట్లు రద్దు..! – hmda cancelled mokila plots of 10 bidders who are not paid first installment


హైదరాబాద్‌లో భూములకు ఓ రేంజ్‌లో డిమాండ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల నిర్వహించిన కోకాపేట, మోకిలా భూముల ఈ- వేలాలలో గజానికే లక్షకు పైగానే ధరలు పలికాయి. అయితే.. వేలంలో కోట్లకు కోట్లు వేలం పాడిన బిడ్డర్లు.. కాసులు కట్టాల్సి వచ్చినప్పుడు మాత్రం తటపటాయిస్తున్నారు. అందులో ప్రత్యేకంగా మోకిలా భూముల విషయంలో.. వేలం జరిగి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికీ డబ్బులు కట్టకుండా బిడ్డర్లు దాటేస్తున్నారు. అయితే.. అలాంటి బిడ్డర్లకు హెచ్ఎండీఏ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూనే.. నోటీసులు కూడా జారీ చేసింది.

అయితే.. మోకిలా లే ఔట్ ఫేస్‌-1లో 50 ప్లాట్లకు వేలం నిర్వహించగా బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. రికార్డు స్థాయిలో అత్యధికంగా గజం.. లక్షా ఐదు వేలకు అమ్ముడుపోయిన విషయం తెలిసిందే. కాగా.. సగటున గజం 80 వేల రూపాయల పైనే పాడుకున్నారు బిడ్డర్లు. పాట అయితే.. గట్టిగానే పాడారు కానీ.. మొదటి ఇన్‌స్టాల్‌మెంట్‌గా చెల్లించాల్సిన 25 శాతం డబ్బును మాత్రం.. ఇప్పటికీ కట్టలేకపోయారు. ఇచ్చిన సమయంలోపు.. మొదటి ఇన్‌స్టాల్‌మెంట్ కట్టని 10 మంది బిడ్డర్లకు హెచ్ఎండీఏ నోటీసులు ఇచ్చింది.

మోకిల ఫేజ్-1 వేలంలో 50 ప్లాట్లల్లో 241, 242, 263, 273, 282, 283, 284, 312, 313, 323 నంబర్ ప్లాట్లను కొన్న కంపెనీలకు హెచ్ఎండీఏ క్యాన్సిలేషన్ లెటర్లు జారీ చేసింది. వాళ్ల ప్లాట్లను రద్దు చేయటమే కాకుండా.. ఈ కంపెనీలు భవిష్యత్తులో హెచ్ఎండీఏ నిర్వహించే వేలంలో పాల్గొనకుండా బ్లాక్ లిస్టులో కూడా పెట్టింది. ఇచ్చిన గడువులోగా మొత్తం ప్లాట్ అమౌంట్లో 25 శాతం చెల్లించనందునే ఈ చర్యలు చేపట్టినట్లు హెచ్ఎండీఏ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం ఇప్పటికే కట్టిన అమౌంటును కూడా జప్తు చేస్తున్నట్లు హెచ్ఎండీఏ తెలిపింది. మిగతా కంపెనీలు, వ్యక్తులు కూడా ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంటును వెంటనే కట్టాలని హెచ్చరించింది. గడువు పొడిగించడం, మినహాయింపులివ్వడం లాంటివి జరగవని.. కట్టని వారిని బ్లాక్ లిస్టులో పెట్టి భవిష్యత్తులో వేలంలో పాల్గొనకుండా చర్యలు తీసుకుంటామని హెచ్ఎండీఏ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

నగర శివార్లలోని భూములను అభివృద్ధి చేసిన HMDA.. ప్లాట్లను ఈ- వేలం వేస్తోంది. ఓఆర్ఆర్‌కు సమీపంలో ఉండటం.. ఎయిర్‌పోర్ట్‌తో కనెక్టివిటీ ఉండడం.. ప్రభుత్వమమే అన్ని సౌకర్యాలు కల్పిస్తుండడంతో ఈ భూములకు మాంచి డిమాండ్ ఏర్పడింది. మరోవైపు.. ప్రభుత్వమే క్లియరెన్స్ ఇస్తున్న ఈ ప్లాట్లకు ఎలాంటి చిక్కులు ఉండవన్న భావనతో చాలా మంది ఈ భూములు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

నాలో ఒక భాగం అక్కడే వదిలేసినట్టు అనిపిస్తోంది.. భువనేశ్వరి భావోద్వేగం

Related Articles

Back to top button