News
Mohammed Azharuddin,జూబ్లీహిల్స్ బరిలో అజారుద్దీన్.. పీజేఆర్ కుమారునికి మొండి’చెయ్యి’..!? – tpcc working president azharuddin likely to contest from jubilee hills constituency in coming telangana assembly elections
ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ.. కాంగ్రెస్ పార్టీలో మరోసారి ఆధిపత్య పోరు రాజుకుంది. ఉన్నదే కొంత మంది అంటే.. వాళ్లలో వాళ్లే టికెట్ నాకంటే నాకు అంటూ కొట్టుకుంటున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. నియోజకవర్గంలోని రహమత్నగర్లో అజారుద్దీన్ వర్గం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో.. ఈసారి జూబ్లీహిల్స్ టికెట్ తనకేనంటూ.. చెప్పుకొచ్చారు. ఈ సమావేశానికి సంబంధించిన సమాచారం అందుకున్న పీజేఆర్ కుమారుడు విష్ణువర్దన్ రెడ్డి వర్గానికి చెందిన కార్యకర్తలు.. అక్కడి వచ్చి గొడవకు దిగారు. విష్ణువర్దన్ రెడ్డికి చెందిన నియోజకవర్గంలో సమావేశం పెట్టి.. కనీసం ఆయనకు సమాచారం ఇవ్వకపోవటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో.. ఇరు వర్గాల కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వెంటనే అక్కడే ఉన్న పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుంచి చెదరగొట్టారు.
ఇదిలా ఉంటే.. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున విష్ణువర్దన్ రెడ్డి బరిలో నిలిచారు. అయితే.. మాగంటి గోపినాథ్ చేతిలో ఓడిపోయారు. కాగా.. అప్పటి నుంచి పార్టీలో యాక్టివ్గా లేకుండా.. ఉన్నారా అంటే ఉన్నారన్న చందంగా ఉంటున్నారని పార్టీ శ్రేణులు మాట్లాడుకుంటున్నారు. తనకు పార్టీ సరైన గుర్తింపు ఇవ్వటం లేదన్న అసంతృప్తితో ఉన్నారని ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. పార్టీలో తాను కూడా ఉన్నానని గుర్తుచేసేందుకు పెద్దలందరినీ పిలిచి.. ఆ మధ్య గట్టిగా దావత్ కూడా ఇచ్చారు. ఆ దావత్కు రేవంత్ రెడ్డి హాజరుకాకపోగా.. స్పెషల్గా మరోసారి భేటీ అయ్యారు. ఏదో ఒక మంది స్థానం కల్పిస్తామని రేవంత్ రెడ్డి గట్టిగానే మాటిచ్చినా.. ఇప్పటివరకు ఎలాంటి పదవి కట్టబెట్టకపోవటం గమనార్హం.
ఇదిలా ఉంటే.. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున విష్ణువర్దన్ రెడ్డి బరిలో నిలిచారు. అయితే.. మాగంటి గోపినాథ్ చేతిలో ఓడిపోయారు. కాగా.. అప్పటి నుంచి పార్టీలో యాక్టివ్గా లేకుండా.. ఉన్నారా అంటే ఉన్నారన్న చందంగా ఉంటున్నారని పార్టీ శ్రేణులు మాట్లాడుకుంటున్నారు. తనకు పార్టీ సరైన గుర్తింపు ఇవ్వటం లేదన్న అసంతృప్తితో ఉన్నారని ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. పార్టీలో తాను కూడా ఉన్నానని గుర్తుచేసేందుకు పెద్దలందరినీ పిలిచి.. ఆ మధ్య గట్టిగా దావత్ కూడా ఇచ్చారు. ఆ దావత్కు రేవంత్ రెడ్డి హాజరుకాకపోగా.. స్పెషల్గా మరోసారి భేటీ అయ్యారు. ఏదో ఒక మంది స్థానం కల్పిస్తామని రేవంత్ రెడ్డి గట్టిగానే మాటిచ్చినా.. ఇప్పటివరకు ఎలాంటి పదవి కట్టబెట్టకపోవటం గమనార్హం.
ఇదిలా ఉంటే.. అజారుద్దీన్ 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ ఏడాదిలో ఆయన యూపీలోని మోరాదాబాద్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు కూడా. ఆ తర్వాత 2019లో సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయాలని ఆశించినా.. అధిష్ఠానం టికెట్ ఇవ్వలేదు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు అజారుద్దీన్. ఈసారి ఎలాగైనా అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగాలని భావిస్తోన్న అజారుద్దీన్.. అందుకు జూబ్లీహిల్స్ అయితేనే కరెక్ట్ అని యోచిస్తున్నట్టు సమాచారం. ఇక అజారుద్దీన్కు టికెట్ ఇస్తే.. ఇక పీజేఆర్ కొడుకు విష్ణువర్దన్కు నాయకత్వం మొండి చెయ్యి ఇచ్చినట్టేనని ప్రచారం సాగుతోంది.