News

mithun reddy, YCP vs TDP: లోకేష్, బ్రాహ్మణి గురించి జగన్ ఎప్పుడూ మాట్లాడలేదు.. అది సంస్కారం అంటే: మిథున్ రెడ్డి – mp midhun reddy criticizes chandrababu and tdp leaders


YCP vs TDP: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధరించే దుస్తుల గురించి.. ఇటీవల తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు చేశారు. జగన్ వేసుకునే షర్ట్, ప్యాంట్, చెప్పులు, వాచ్ ధరలను ప్రెస్ మీట్ పెట్టిమరీ చెబుతున్నారు. దీంతో వైసీపీ కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేసింది. తాజాగా.. వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి (Mithun Reddy) ఘాటుగా స్పందించారు. 2024 ఎన్నికల్లో ఓడిపోతారనే భయం చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

‘జగన్‌ను చంద్రబాబు, టీడీపీ వాళ్లు ఎంత ద్వేషిస్తున్నారో అర్థం అవుతోంది. ఆఖరికి ఆయన వేసుకునే బట్టలు, చెప్పుల గురించి కూడా మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తి బట్టలు కూడా వేసుకోవద్దా. ఇంత నీచంగా మాట్లాడుతున్నారు. రాజకీయాలను వ్యక్తిగత స్థాయికి దిగజార్చుతున్నారు. దీనికి కారణం టీడీపీ వాళ్లే. లోకేష్, బ్రాహ్మణి, వాళ్ల పిల్లలు, వారు వేసుకునే బట్టలు, వారు తిరిగే వెహికిల్స్ గురించి జగన్ ఏ రోజూ మాట్లాడలేదు. జగన్ ఎప్పుడైనా పొలిటికల్‌గా మాట్లాడారు’ మిథున్ రెడ్డి వివరించారు.

వేసవిలో దట్టమైన పొగమంచు.. తిరుమలలో ప్రకృతి అందాలు

‘జగన్ మాట్లాడింది పరిశీలిస్తే.. ఎప్పుడూ కూడా వ్యక్తిగత దూషణ చేయరు. ఎవ్వరినీ తిట్టరు. కేవలం రాజకీయాలు మాత్రమే మాట్లాడుతారు. కానీ.. చంద్రబాబు, టీడీపీ నేతలు అలా కాదు. జగన్‌పై వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు.. టీడీపీకి మళ్లీ ఓటమి భయం పట్టుకుంది. అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. మహిళలతో ప్రెస్ మీట్లు పెట్టించి.. జగన్ తిట్టించే ప్రయత్నం చేస్తున్నారు’ అని మిథున్ రెడ్డి ఆరోపించారు.

‘అమరావతి విషయంలో చంద్రబాబు పెద్ద కలలుగన్నారు. 50 వేల ఎకరాలతో రియల్ ఎస్టేట్ చేసి.. డబ్బులు సంపాదించుకోవాలి అనుకున్నారు. అంబానీలా పెద్దోడు అయిపోవాలి అనుకున్నారు. కానీ.. జగన్ అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు. దాంతో.. వారి భూముల రేట్లు పడిపోతాయని చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. రాజధాని అంటే అందరికీ సంబంధించింది. అక్కడ అన్ని వర్గాల వారు ఉండాలి’ అని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు.

‘కరకట్ట పక్కన ఉన్న నివాసాన్ని సీఐడీ అటాచ్ చేసింది. ఆ ఇంటి ఓనర్ లింగమనేని.. ఆ ఇల్లుతో తనకు సంబంధం లేదని చెబుతున్నారు. చంద్రబాబు కూడా ఆ ఇల్లు తనది కాదు.. కేవలం అద్దెకు ఉన్నానని చెబుతున్నారు. అసలు అది ఎవరిదో.. ఇద్దరూ చెప్పడం లేదు. అలాంటప్పుడు అటాచ్ చేస్తే తప్పేంటి. ఇంకా ఇలాంటిని ఉంటే అటాచ్ చేయాలని నేను సీఐడీ అధికారులను కోరుతున్నాను. నిజాలను ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను’ అని మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Related Articles

Back to top button