Mekapati Chandra Sekhar Reddy,చంద్రబాబు విడుదల కావాలంటూ.. 37 వేల లడ్డూలతో పూజ చేసిన వైసీపీ ఎమ్మెల్యే – udayagiri mla mekapati vinayaka pooja with 37000 laddu for chandrababu release
‘వినాయకుడి ఆశీస్సులతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలోనే జైలు నుంచి బయటకు వస్తారని ఆశిస్తున్నాను. చంద్రబాబుకు, ఏపీ ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటున్నాను’ అని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.
నెల్లూరు జిల్లాలో కీలక నేతల్లో ఒకరిగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉదయగిరి నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడారనే ఆరోపణలతో వైసీపీ ఆయణ్ని సస్పెండ్ చేసింది. పార్టీ నుంచి సస్పెండ్ అయినా, టెక్నికల్గా ఆయన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
‘త్వరలోనే తెలుగు దేశం పార్టీలో చేరతా. చంద్రబాబు నాయుడు అరెస్టు కాకుండా ఉంటే, ఇప్పటికే పార్టీలో చేరేవాణ్ని. చేరికపై జవాబు వచ్చాక పార్టీలో అధికారికంగా చేరతాను’ అని మేకపాటి తెలిపారు.
‘4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచా. అయినా నా గ్రాఫ్ బాగాలేదని సీఎం జగన్ చెప్పారు. ఉదయగిరిలో నేను తప్ప వేరె ఎవ్వరూ గెలవలేరు. చంద్రబాబు నాయుడు టికెట్ ఇస్తే, ఇక్కడ నుంచి మరోసారి గెలుస్తా. టికెట్ ఇవ్వకపోయినా టీడీపీలోనే కొనసాగుతా. రాష్ట్రంలో ధర్మం, న్యాయం లేదు. ప్రజలకు కూడా ఈ విషయం అర్థమైంది. చంద్రబాబు అధికారంలోకి వస్తేనే న్యాయం జరుగుతుంది’ అని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.