News

liquor queen kavitha, కవిత ఎపిసోడ్‌లో కీలక పరిణామం.. ఈడీకి మరో లేఖ.. ‘అందులో ఆంతర్యం ఏంటీ..?’ – brs mlc kavitha written one more letter to ed about inquiry in delhi liquor scam case


ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు విచారణ నేపథ్యంలో తనకు జారీ అయిన నోటీసులపై మరోసారి ఈడీకి లేఖ రాసారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కాగా.. ముందు ఈ నెల 15న విచారణకు వెళ్తారని కవిత వర్గీయులు తెలపగా.. ఇప్పుడు రాసిన లేఖలో ఈ నెల 11న విచారణకు హాజరవుతారని కవిత స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం నాడు ఆమె ఈడీ జాయింట్ డైరెక్టర్‌కు లేఖ రాశారు. ముందస్తు అపాయింట్‌మెంట్లు, కార్యక్రమాలు ఉన్నందున 9న విచారణకు హాజరు కాలేమని తేల్చి చెప్పారు. అయితే.. హడావిడిగా దర్యాప్తు చేయడం ఏంటని ఈడీని కవిత నిలదీశారు. ఇంత స్వల్ప కాలంలో విచారణకు రావాలని నోటీసులు జారీ చేయడం ఏంటో అర్థం కావడం లేదని లేఖలో పేర్కొన్నారు. దర్యాప్తు పేరిట రాజకీయo చేస్తున్నట్లు కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుత దర్యాప్తుతో తాను చేసేది ఏమీ లేదని తెలిపారు.

ఒక సామాజిక కార్యకర్తగా ఒక వారం ముందే నా కార్యక్రమాలు ఖరారయ్యాయనీ, కాబట్టి 11వ తేదీన విచారణకు హాజరవుతానని ఈడీకి కవిత తెలియజేశారు. రాజకీయ కక్షలో భాగంగానే ఇదంతా చేస్తున్నట్లు స్పష్టమవుతుందన్నారు. దేశ పౌరురాలిగా ఒక మహిళగా చట్టపరమైనటువంటి అన్ని హక్కులను తాను ఉపయోగించుకుంటానని తేల్చి చెప్పారు. గతంలో ఆయా కోర్టులు ఇచ్చిన తీర్పుల ప్రకారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశం ఉన్నప్పటికీ నేరుగా ఈడి కార్యాలయానికి పిలవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఒక మహిళను తన నివాసంలో విచారించాలని కోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. వీటన్నింటినీ ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని అడిగారు.
అయితే… ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో గురువారం అంటే.. తొమ్మిదో తారీఖున విచాణరకు హాజరుకావాలని మహిళా దినోత్సవం రోజునే కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నోటీసులపై వెంటనే స్పందించిన కవిత.. తాను పదో తారీఖున ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో పెద్ద ఎత్తున దీక్ష చేయటానికి తలపించారు. ఇందుకు దేశవ్యాప్తంగా ఉన్న పలు రాజకీయ పార్టీల నేతలు మద్దతు తెలిపేందుకు వస్తున్నారు. కాగా.. ఆ కార్యక్రమాలు చూసుకోవాలని.. విచారణకు హాజరు కాలేని తేల్చిచెప్పారు. అయితే.. ఈ నోటీసులపై తన తండ్రి సీఎం కేసీఆర్‌ను కూడా కవిత సంప్రదించారు. కాగా.. ఎలాంటి ఆందోళన అవసరం లేదని.. ధైర్యంగా నీ పని నువ్వు చేసుకోవాలని సూచించారు. వెంటనే ఢిల్లీకి వెళ్లారు. అక్కడికి చేరుకున్నాక.. ఈడీకి లేఖ రాశారు కవిత.

‘వుమెన్స్‌ డే’ వేళ తెలంగాణ మహిళలకు గుడ్‌న్యూస్.. 100 ఆస్పత్రుల్లో ఆ పరీక్షలన్నీ ఫ్రీ

  • Read More Telangana News And Telugu News

Related Articles

Back to top button