News

ktr, Bandi Sanjay: అమెరికాలో చిప్పలు కడిగొచ్చిన మీకు.. నా క్యారెక్టర్‌కు పొంతనా ? – bjp state president bandi sanjay fires on telangana government and minister ktr


Bandi Sanjay Kumar: తెలంగాణలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కుటుంబ, అవినీతి, నియంత పాలనకు స్వస్తి పలికేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో చంపాపేటలో నిర్వహించిన ఉపాధ్యాయ, అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన సోమవారం పాల్గొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కేవలం టీచర్లకే పరిమితం కావని.. ఇవి తెలంగాణ ప్రజల తల రాతనే మార్చే ఎన్నికలు కాబోతున్నాయన్నారు. టీఆర్ఎస్ పాలనతో విసిగిపోయిన ప్రజలంతా మార్పు కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్‌పై బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు.

“బండి సంజయ్ అఫ్ట్రాల్ కార్పొరేటర్.. ఆయనను అధ్యక్షుడు చేస్తే ఏమైతదని ట్విట్టర్ టిల్లు అన్నడు. మా నాయన ఉపాధ్యాయుడు. సిద్ధాంతాల కోసం పనిచేస్తున్నా. నేను ఏనాడూ మా నాన్న పేరు చెప్పుకుని రాలేదు. మీ అయ్య లేకపోతే మిమ్ముల్ని కుక్కలు కూడా దేఖవ్. అమెరికాలో చిప్పలు కడిగొచ్చిన మీకు, నా క్యారెక్టర్‌కు పొంతనా ? నేను ప్రజల కోసం, హిందూ ధర్మం కోసం, 317 జీవో కోసం, ఆర్టీసీ కార్మికుల కోసం, నిరుద్యోగుల కోసం, తెలంగాణ కోసం జైలుకుపోయిన. మళ్లీ పోయేందుకు సిద్ధం.

కేవలం ఎన్నికలున్న జిల్లాల్లో మాత్రమే ఒకటో తారీఖున జీతాలిస్తున్నడు. బీజేపీ మాట్లాడితే తప్ప జీతాలు ఇయ్యలేని పరిస్థితి. ఉపాధ్యాయ సంఘాల సభ్యులంతా వాస్తవాలు ఆలోచించండి. ఉపాధ్యాయులు 317 జీవోపై ప్రగతి భవన్, డీఎస్సీ ఎదుట ఆందోళన చేస్తే పసిపిల్లలని కూడా చూడకుండా అరెస్ట్ చేశారు. దీనిపై సీఎంకు వార్నింగ్ ఇస్తే తప్ప వారిని విడుదల చేయలేదు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 317 జీవోను సవరిస్తాం, ఉద్యోగ, ఉపాధ్యాయులకు న్యాయం చేస్తాం. స్కూళ్లలో స్కావెంజర్లు లేరు. టీచర్లే టాయిలెట్లు శుభ్రం చేసే దుస్థితి. ఉద్యోగులకు ఇప్పటివరకు పీఆర్సీ, 4 డీఏలు ఇయ్యలేదు. బదిలీలు, ప్రమోషన్లు లేవు. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం లేదు. ఎన్నికల సమయంలో టీచర్లకు డ్యూటీలు వేయాలంటేనే భయపడుతున్నరు.

తెలంగాణలో మార్పు జరగాలని, కుటుంబ, అవినీతి, నియంత పాలనకు స్వస్తి పలకాలని ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే ప్రజలు బీజేపీకి మద్దతు తెలుపుతున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుంది. దుబ్బాకలో టీఆర్ఎస్‌ను ఓడించాం. హుజూరాబాద్‌లో ఓడించాం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బుద్ది చెప్పినం. మునుగోడులో ఒక్కో పోలింగ్ బూత్‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్యేను నియమించి, ఓటుకు వేలాది రూపాయలిచ్చినా గట్టి పోటీ ఇచ్చినం. ఒక్కసారి ఏవీఎన్ రెడ్డి గారిని గెలిపించండి. మీ సమస్యలను పరిష్కరిస్తాడు. ఏవీఎన్ రెడ్డి గారు గెలవకపోతే మీ సమస్యలపై ప్రశ్నించే వాళ్లు ఉండరు.

మోదీ పాలన చూడండి.. కేసీఆర్ పాలనను చూడండి. మోదీ పాలనను ప్రపంచమంతా కీర్తిస్తోంది. కేసీఆర్ పాలనను దేశమంతా అసహ్యించుకుంటోంది. కేసీఆర్ పాలనలో టీచర్లు, ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు, విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారంటే కేసీఆర్ పాలన ఎట్లుందో అర్ధం చేసుకోవచ్చు. ఏవీఎన్ రెడ్డి గారిని గెలిపిస్తే ప్రభుత్వ మెడలు వంచి పీఆర్సీని వేయిస్తాం.. ఫస్ట్ తారీఖునే జీతాలిప్పిస్తాం.. 317 జీవోపై పోరాటం చేస్తాం. ఈ ఫలితాలతో ప్రజలను పిసికి చంపుతారో… కాపాడుకుంటారో మీరే ఆలోచించండి. ఏవీఎన్ రెడ్డి గారికి ఓటేయకపోతే చారిత్రక తప్పిదం చేసిన వాళ్లవుతారు.” అని బండి సంజయ్ వ్యాఖ్యనించారు.

Read More Telangana News And Telugu News

Related Articles

Back to top button