khammam, Srinivasa Reddy: మనిషిలా చూడండి.. ఎన్ని బాధలు అనుభవించాం.. ఆవేదన వెల్లగక్కిన పొంగులేటి – ponguleti srinivas reddy revealed the difficulties faced in brs
‘పినపాకలో నీకేం ఏం పని అని కొంతమంది అడుగుతున్నారు. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికే వచ్చా. కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ మాట మీద టీఆర్ఎస్లో చేరాను. కేటీఆర్తో ఉన్న చనువుతో టీఆర్ఎస్లోనే కంటిన్యూ అయ్యాం. పార్టీ మారిన తర్వాత నాకు ఏం జరిగిందో సమయం వచ్చినప్పుడు చెబుతా. రాబోయే ఎన్నికల్లో అందరం కలిసి పోటీ చేస్తాం. శీనన్న మీతోనే ఉంటాడు.. మీ కోసం నడుస్తాడు. మీరు అధికార మదంతో రెచ్చిపోయినా ప్రజలు తీర్పు ఇచ్చే రోజు ఎంతో దూరంలో లేదు. నేను అడిగితే మీరు సెక్యూరిటీ ఇవ్వలేదు. ఇప్పుడు సెక్యూరిటీ తగ్గించినా నేను అడగను’ అంటూ పొంగులేటి తెలిపారు.
‘ఉన్న ఇద్దరు గన్మెన్లను కూడా వెనక్కి తీసుకోండి. నేను భూదందాలు చేయలేదు. గొంతు ఎత్తకుండా నేను ఉండలేను. కష్టాలను చెప్పుకుంటే ఎందుకు భయపడుతున్నారు. నాకు రాజకీయంగా గాడ్ఫాదర్ ఎవరూ లేరు. నాకు గాడ్ఫాదర్ ఖమ్మం జిల్లా ప్రజలు, తెలంగాణ ప్రజలే. నాలుగేళ్లుగా పదవి లేకపోవడానికి కారణం ఏంటో మీకు తెలుసు. పార్టీ మారుతున్నానని, పార్టీ మారనని చెప్పట్లేదు. మనస్సులో ఉన్న ఆవేదన చెబుతున్నా. గొంతెత్తకుండా ఆనాడు లేను.. ఇప్పుడూ ఉండను. పదవులు అవే వస్తాయి… పోయేటప్పుడు పోతాయి. పొడు భూముల సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. ఎమ్మెల్యేలు ఆ ప్రాంతాల్లో రాజుల్లా అరాచకాలు చేస్తున్నారు. అధికారం ఉందని అసెంబ్లీని సామ్రాజ్యంగా చేసుకుని దోచుకుంటున్నారు. చేస్తున్న ప్రతి పనికి అనుభవించక తప్పదు. వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్పి వస్తుంది’ అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ ఆత్మీయ సమావేశంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫొటోలు కనబడలేదు. దీంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరడం ఖాయమైనట్లు తెలుస్తోంది. కానీ ఆయన పరోక్షంగా సంకేతాలు ఇస్తుండగా.. అధికారికంగా చెప్పడం లేదు. ఈ నెల 18న ప్రధాని మోదీ, అమిత్ షాలను కలిసిన తర్వాత పొంగులేటి బీజేపీలో చేరిక విషయం అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఆయన బీజేపీలో చేరడం దాదాపు లాంఛనమే అని చెప్పవచ్చు.
- Read More Telangana News and Telugu News