News
joshimath cracks, జోషిమఠ్లో భయం భయం.. కూలిపోతోన్న గుళ్లు, ఇళ్లు.. అసలు కారణం అదేనా..? – uttarakhand jyotirmath cracks now develops in shankaracharya matth also
ముందుజాగ్రత్త చర్యగా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డిఆర్ఎఫ్) బృందాలను కూడా ఆ ప్రాంతంలో మోహరించారు.
జోషిమఠ్లో 15 రోజులుగా ఎప్పుడు ఏం జరుగుతుందోనని మిగతా కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నాయి. జోషీమఠ్లోని భూమి క్రమంగా కుంగిపోతుండటంతో రోడ్లు, ఇళ్లకు పెద్ద పెద్ద పగుళ్లు వస్తున్నాయి. ఓ దేవాలయంతో సహహా కొన్ని ఇళ్లు కూడా ఇప్పటికే కూలిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర బిక్కుబిక్కమంటూ కాలం వెల్లదీస్తున్నారు. హిందూ మఠాల్లో ఒకటైన జోషిమఠ్ పరిస్థితి ఇప్పుడు భయంకరంగా మారింది. 15 రోజులుగా ఈ పగుళ్లు ఎక్కువయ్యాయని జోషిమఠ్ నిర్వాహకులు తెలిపారు.
ఈ విపత్తుకు ‘అభివృద్ధి’ ఒక కారణమని మఠాధిపతి స్వామి విశ్వప్రియానంద పేర్కొన్నారు. “అభివృద్ధి పేరుతో జలవిద్యుత్ ప్రాజెక్టులు, సొరంగాలు తవ్వటం వల్లే తమ ప్రాంతం ప్రభావితమైందన్నారు. 15 రోజుల ముందు పగుళ్లు లేవు, కానీ ఈ రోజుల్లో పగుళ్లు నిరంతరంగా మఠంలో పెరుగుతున్నాయి.” అంటూ విశ్వప్రియానంద ఆందోళన వ్యక్తం చేశారు. అయితే.. జ్యోషిమఠ్లో ఏర్పడిన ఈ పరిస్థితిపై ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి.. పరిస్థితిపై సమీక్షించారు. ఈ పరిస్థితిపై పీఎంవో అత్యవసర సమీక్షా సమావేశం కూడా నిర్వహింస్తోంది.
జోషిమఠ్ పట్టణాన్ని జ్యోతిర్మఠ్ అని కూడా పిలుస్తారు. ఇది బద్రీనాథ్ శీతాకాలపు విడిది ప్రాంతం. ప్రధాన బద్రీనాథ్ ఆలయం నుంచి జోషిమాత విగ్రహాన్ని ప్రతి శీతాకాలంలో వాసుదేవ ఆలయానికి తీసుకువస్తారు. పవిత్ర పట్టణం జోషిమఠ్ దేశంలోని ముఖ్యమైన తీర్థయాత్ర కేంద్రంగా ప్రసిద్ధి చెందింది.
- Read More Telangana News And Telugu News