jitesh sharma, భారత జట్టులోకి మరో దినేశ్ కార్తీక్.. సంజూ శాంసన్కు రీప్లేస్మెంట్గా..! – all you need to know about jitesh sharma who replaced sanju samson
జితేశ్ శర్మ తన కెరీర్లో 76 టీ20 మ్యాచ్లు ఆడాడు. గత ఏడాది టీ20ల్లో దినేశ్ కార్తీక్ ఎలాగైతే టీమిండియాకు ఫినిషర్, వికెట్ కీపర్ రోల్ పోషించాడో.. జితేశ్ సైతం విదర్భ తరఫున అలాంటి పాత్రే పోషిస్తున్నాడు.
దినేశ్ కార్తీక్ వయసును దృష్టిలో ఉంచుకొని టీ20 వరల్డ్ కప్ తర్వాత అతణ్ని పక్కనబెట్టిన బీసీసీఐ.. అతడి స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాడు శర్మ అని భావిస్తోంది. అందుకే అనూహ్యంగా అతడికి తొలిసారి భారత జట్టులోకి పిలుపు అందింది. 2014 మార్చి 31న టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ విదర్భ క్రికెటర్.. దాదాపు 9 ఏళ్ల తర్వాత భారత జట్టు నుంచి పిలుపు అందుకున్నాడు.
జితేశ్ శర్మ ఇంతకు ముందు ముంబై ఇండియన్స్ జట్టులో ఉండేవాడు. కానీ గత ఏడాది పంజాబ్ కింగ్స్ తరఫున ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్పై ఫస్ట్ మ్యాచ్ ఆడిన జితేశ్.. 17 బంతుల్లో 26 పరుగులు చేశాడు. గత సీజన్లో పంజాబ్ తరఫున 10 ఇన్నింగ్స్ ఆడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 234 రన్స్ చేశాడు.
శర్మ ఢిల్లీ క్యాపిటల్స్పై 34 బంతుల్లో 44 రన్స్ చేశాడు. ఆ మ్యాచ్లో 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 67 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజ్లోకి వచ్చిన జితేశ్ 44 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్లో పంజాబ్ 17 పరుగుల తేడాతో ఓడినప్పటికీ.. శర్మ పోరాటం అభిమానుల్ని ఆకట్టుకుంది. రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో జితేశ్ 18 బంతుల్లో 38 రన్స్ చేశాడు. దీంతో 14.4 ఓవర్లలో 119/4తో ఉన్న పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 రన్స్ చేయగలిగింది. స్లాగ్ ఓవర్లలో వేగంగా పరుగులు చేయడంతోపాటు.. టాప్ ఆర్డర్ విఫలమైనప్పుడు జట్టును ఆదుకునే బ్యాటర్ కావాలనే ఉద్దేశంతో శర్మను బీసీసీఐ ఎంపిక చేసింది.
ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో జితేశ్ శర్మ ముంబైపై 24 బంతుల్లోనే 46 రన్స్ చేశాడు. 12 ఓవర్లలో విదర్భ 5 వికెట్ల నష్టానికి 95 రన్స్ చేసిన దశలో క్రీజ్లోకి వచ్చిన శర్మ 20 బంతుల్లో 26 రన్స్ చేశాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో గేర్ మార్చిన జితేశ్.. మరో 4 బంతుల్లోనే 18 రన్స్ చేశాడు. దీంతో విదర్భ 20 ఓవర్లలో 164/7గా నిలిచింది.
ఇప్పటికే పంత్ గాయపడటం, కేఎల్ రాహుల్ కూడా జట్టులో లేకపోవడం.. సంజూకు గాయం కావడంతో.. జట్టులో వికెట్ కీపర్గా ఇషాన్ కిషన్ మాత్రమే మిగిలాడు. దీంతో ముందు జాగ్రత్తగా బోర్డు జితేశ్ శర్మను ఎంపిక చేసింది.
Read More Sports News And Telugu News