News

IPL 2023లో ముగిసిన పంజాబ్ కథ.. గెలిచినా రాజస్థాన్‌కి కష్టమే – rajasthan royals beat punjab kings by 4 wickets in ipl 2023


ఐపీఎల్ 2023 (IPL 2023)నుంచి పంజాబ్ కింగ్స్ (PBKS) నిష్క్రమించింది. ధర్మశాల వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 4 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ (RR) విజయం సాధించింది. మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ టీమ్ 187 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ 19.4 ఓవర్లలోనే 189/6తో ఛేదించేసింది. సీజన్‌లో 14వ (లీగ్ దశలో లాస్ట్) మ్యాచ్ ఆడేసిన రాజస్థాన్‌కి ఇది ఏడో విజయంకాగా.. పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. మరోవైపు 14వ మ్యాచ్ ఆడిన పంజాబ్‌కి ఇది 8వ ఓటమికాగా.. ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాయింట్ల పట్టికలో నెం.4లో ఉన్న బెంగళూరు కంటే నెట్‌ రన్‌రేట్‌లో వెనకబడిన రాజస్థాన్ ప్లేఆఫ్స్‌కి చేరడం కష్టమే. రాజస్థాన్ ప్లేఆఫ్స్‌కి వెళ్లాలంటే బెంగళూరు నెక్ట్స్ మ్యాచ్‌లో చిత్తు చిత్తుగా ఓడిపోవాలి. అలానే ముంబయి, కోల్‌కతా కూడా నెక్ట్స్ మ్యాచ్‌లో గెలవకూడదు.

188 పరుగుల లక్ష్యఛేదనలో రాజస్థాన్ టీమ్‌కి ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ జోస్ బట్లర్ (0) డకౌటయ్యాడు. కానీ.. సూపర్ ఫామ్‌లో ఉన్న మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (50: 36 బంతుల్లో 8×4), నెం.3లో వచ్చిన దేవదత్ పడిక్కల్ (51: 30 బంతుల్లో 5×4, 3×6) నిలకడగా ఆడి రెండో వికెట్‌కి 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కానీ.. టీమ్ స్కోరు 85 వద్ద పడిక్కల్ ఔటైపోగా అనంతరం వచ్చిన సంజు శాంసన్ (2) నిరాశపరిచాడు. కానీ చివర్లో సిమ్రాన్ హెట్‌మెయర్ (46: 27 బంతుల్లో 4×4, 3×6) దూకుడుగా ఆడి రాజస్థాన్‌ని గెలుపు తీరాలకి చేర్చి 179 పరుగుల వద్ద ఔటైపోయాడు. రాజస్థాన్ విజయానికి చివరి 6 బంతుల్లో 9 పరుగులు అవసరం అవగా.. రాహుల్ చాహర్ బౌలింగ్ చేశాడు. లాస్ట్ ఓవర్‌లో సిక్స్ బాదిన ధ్రువ్ జురెల్ (10 నాటౌట్: 4 బంతుల్లో 1×6) గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు.

మ్యాచ్‌లో అంతకముందు శామ్ కరన్ (49 నాటౌట్: 31 బంతుల్లో 4×4, 2×6), షారూక్ ఖాన్ (41 నాటౌట్: 23 బంతుల్లో 4×4, 2×6), జితేశ్ శర్మ (44: 28 బంతుల్లో 3×4, 3×6) ఫర్వాలేదనిపించడంతో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ టీమ్ 5 వికెట్ల నష్టానికి 187 రన్స్ చేసింది. రాజస్థాన్ బౌలర్లలో నవదీప్ సైనీ 3 వికెట్లు పడగొట్టగా.. ఆడమ్ జంపా, ట్రెంట్ బౌల్ట్ చెరో వికెట్ తీశారు.

Related Articles

Back to top button