News

India Vs Srilanka,టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌.. తుదిజట్టులో కీలక మార్పు – asia cup 2023: india have won the toss and they have decided to bat first aganst srilanka


ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా అతిథ్య జట్టు శ్రీలంకతో మ్యాచ్‌లో టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేయనుంది. ఈ మ్యాచులో టాస్‌ గెలిచిన భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. శ్రీలంకతో మ్యాచ్ కోసం తుదిజట్టులో ఓ మార్పు చేసింది భారత్‌. శార్దూల్ ఠాకూర్ స్థానంలో స్పిన్నర్ అక్షర్ పటేల్ భారత జట్టులోకి వచ్చాడు. పిచ్ పరిస్థితులను బట్టి ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నట్టు రోహిత్‌ శర్మ తెలిపాడు.

శ్రీలంక మాత్రం తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే భారత్‌తో పోరుకు దిగింది. సోమవారం పాకిస్థాన్‌తో తలపడిన భారత్.. 15 గంటల వ్యవధిలోనే శ్రీలంకతో మ్యాచ్‌ ఆడుతోంది.

ఆసియా కప్‌ సూపర్-4 స్టేజ్‌లో ఇప్పటివరకు భారత్, శ్రీలంక జట్లు ఒక్కో మ్యాచు ఆడాయి. భారత్, పాకిస్థాన్‌పై.. శ్రీలంక, బంగ్లాదేశ్‌పై విజయం సాధించాయి. ఈ మ్యాచులో గెలిచిన జట్టుకు ఫైనల్‌ చేరే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. ఇప్పటికే పాయింట్స్ టేబుల్‌లో భారత్‌ మొదటి స్థానంలో ఉంది. ఒకవేళ భారత్ గనక మ్యాచ్‌ గెలిస్తే దాదాపు ఫైనల్‌ చేరినట్లే!

తుది జట్లు:

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్(వికెట్‌ కీపర్‌), హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా

శ్రీలంక: పతుమ్ నిస్సంక, దిముత్ కరుణరత్నె, కుశాల్ మెండిస్, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వ, దసున్ శనక, దునిత్ వెల్లలగె, మహీశ్ తీక్షణ, కసున్ రజిత, మతీశ పతిరాన

Related Articles

Back to top button