News
ind vs nz 3rd odi, గిల్, రోహిత్ శతకాలు.. ఆఖర్లో హార్దిక్ మెరుపులు.. కివీస్ ముందు భారీ లక్ష్యం – shubman gill and rohit sharma tons helps team india to set 386 runs target to new zealand in 3rd odi
ఇన్నింగ్స్ 25వ ఓవర్లో రోహిత్ శర్మ (83 బంతుల్లో) సెంచరీ, గిల్ సెంచరీలు నమోదు చేశారు. వీరిద్దరి దూకుడు చూస్తే భారత్ 450కిపైగా పరుగులు చేయడం ఖాయమనిపించింది. కానీ శతకం నమోదు చేసిన కాసేపటికే (85 బంతుల్లో 101; 9×4, 6×6) రోహిత్ పెవిలియన్ చేరగా.. జట్టు స్కోరు 230 పరుగుల వద్ద గిల్ (78 బంతుల్లో 112; 13×4, 5×6) భారీ షాట్కు యత్నించి ఔటయ్యాడు. ఆ తర్వాత మధ్య ఓవర్లలో కివీస బౌలర్లు భారత బ్యాటర్లను బాగా కట్టడి చేశారు. దీంతో 26 ఓవర్లలోనే 212 పరుగులు చేసిన భారత్.. 40 ఓవర్లకు గానీ 300 పరుగులు చేయలేకపోయింది.
ఓపెనర్లు ఔటయ్యాక క్రీజ్లోకి వచ్చిన ఇషాన్ కిషన్ (17).. విరాట్ కోహ్లితో సమన్వయ లోపం కారణంగా రనౌటయ్యాడు. బాగా ఆడుతున్నట్టు కనిపించిన కోహ్లి (27 బంతుల్లో 36) కూడా కాసేపటికే డఫే బౌలింగ్లో క్యాచ్ ఔటయ్యాడు. ఆ తర్వాత సూర్య (14), వాషింగ్టన్ సుందర్ (9) కూడా త్వరగా పెవిలియన్ చేరారు. దీంతో భారత్ 42.2 ఓవర్లలో 313 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది.
ఈ దశలో హార్దిక్ పాండ్య (38 బంతుల్లో 54), శార్దుల్ ఠాకూర్ (17 బంతుల్లో 25) ఏడో వికెట్కు 54 పరుగులు జోడించి భారత్ను ఆదుకున్నారు. హార్దిక్ పాండ్య మెరుపు హాఫ్ సెంచరీ బాదడంతో భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో డఫే 10 ఓవర్లలో 100 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా.. బ్లెయిర్ టిక్నర్ 10 ఓవర్లలో 73 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. బ్రాస్వెల్కు ఒక వికెట్ దక్కింది.