Hyderabad Traffic Restrictions: నగర ప్రజలకు ముఖ్య గమనిక.. శ్రీరామ నవమి శోభ యాత్ర కోసం హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఇవీ పూర్తి వివరాలు.. | Traffic restrictions in Hyderabad for Sri Rama Navami Shobha Yatra, check details here Telugu News
ఊరేగింపు ఈ ప్రాంతాల గుండా వెళ్లినప్పుడు ఆయా ప్రదేశాలలో ట్రాఫిక్ మళ్లించబడుతుంది. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి తాము కోరుకున్న గమ్యస్థానాలకు చేరుకోవాలని, ప్రజలు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

Sri Rama Navami Shobha Yatr
మార్చి 30 గురువారం శ్రీరామ నవమి సందర్భంగా జరగనున్న శ్రీరామ నవమి శోభ యాత్రకు ముందు హైదరాబాద్ పోలీసులు పలు జంక్షన్లలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధించారు. వివిధ ప్రాంతాల్లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు..ప్రయాణీకులు, పట్టణ ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు. భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గురువారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే సీతారాముల కల్యాణం తర్వాత మధ్యాహ్నం 1 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు. ఊరేగింపు సీతారాంబాగ్ ఆలయం నుండి రామ్కోట్లోని హనుమాన్ వ్యాయంశాల వరకు తీసుకువెళతారు. ఈ శోభ యాత్రలో 1 లక్ష మందికి పైగా భక్తులు పాల్గొనే అవకాశం ఉంది.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ నోటిఫికేషన్ ప్రకారం , గురువారం ఉదయం 9 గంటల నుండి ప్రధాన ఊరేగింపు సీతారాం బాగ్ ఆలయం నుండి రామ్కోట్లోని హనుమాన్ వ్యాయంశాల స్కూల్ వరకు, భోయిగూడ కమాన్, మంగళ్హాట్ పిఎస్ రోడ్, జాలి హనుమాన్, ధూల్పేట్ పురానాపూల్, గాంధీ విగ్రహం, జుమెరత్ బజార్, చుడీ బజార్, బేగంబజార్ ఛత్రి, బేగంబజార్, బర్తన్ బజార్, సిద్దిఅంబర్ బజార్, శంకర్ షేర్ హోటల్, గౌలిగూడ చమన్, గురుద్వారా, పుత్లిబౌలి ఎక్స్ రోడ్స్, కోటి, సుల్తాన్ బజార్ మీదుగా ప్రయాణిస్తుండగా, చిన్న ఊరేగింపులు వివిధ పాయింట్ల వద్ద ప్రధాన ఊరేగింపుతో కలుస్తాయి.
ఊరేగింపు ఈ ప్రాంతాల గుండా వెళ్లినప్పుడు ఆయా ప్రదేశాలలో ట్రాఫిక్ మళ్లించబడుతుంది. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి తాము కోరుకున్న గమ్యస్థానాలకు చేరుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం..