News

harish rao comments on babu, ‘చంద్రబాబుని కదిలిస్తే చార్మినార్‌ కూడా నేనే కట్టానంటాడు’ – minister harish rao comments on tdp president nara chandrababu naidu


టీడీపీ దయ వల్లే తెలంగాణ ప్రజలు అన్నం తిన్నారన్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు తనదైన శైలిలో స్పందించారు. తెలంగాణ ప్రజలు జొన్న, మక్క గట్క తప్ప ఏమీ తినలేదని.. వాళ్లకి అన్నం తినడం తానే నేర్పించానని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కువ తక్కువ మాట్లాడితే హైదరాబాద్‌లో ఉన్న చార్మినార్ కూడా తానే కట్టానని చంద్రబాబు అంటాడంటూ ఎద్దేవా చేశారు మంత్రి హరీశ్‌రావు. తెలంగాణ రాష్ట్రంలో భూమికి బరువయ్యేంత పంట పండుతుందన్నారు. ఈ యాసంగిలో ఆంధ్రప్రదేశ్‌లో 16 లక్షల ఎకరాలు వరి సాగుచేస్తే, తెలంగాణలో 54 లక్షల ఎకరాలలో వరి సాగు చేశామని హరీశ్ రావు పేర్కొన్నారు.

సిద్ధిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లో చాట్లపల్లి సర్పంచ్ రాచర్ల రమేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి గ్రేస్ బాల్-క్రికెట్ టోర్నమెంట్ విజేత, రన్నరప్‌లకు మంత్రి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ జన్మదినం పురస్కరించుకుని క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన రాచర్ల రమేశ్‌ను అభినందించారు. కేసీఆర్ కారణజన్ముడని, చరిత్రను తిరగరాశారని, కేసీఆర్ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొండపోచమ్మ, మల్లన్న సాగర్‌లకు నీళ్లు వచ్చేవి కావని వివరించారు.

తైవాన్ దేశం నుంచి పాక్స్‌కాన్ కంపనీ లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం కేసీఆర్ గారిని చెప్పటం హర్షించదగ్గ విషయమని హరీశ్ రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధిపై ప్రజంటేషన్ ఇవ్వగా.., ఏడేండ్లలో అబ్బురపోయేలా సాధించిన అభివృద్ధి, కేసీఆర్ విజన్ చూసి.. తైవాన్ వచ్చి తమ ప్రభుత్వానికి వివరించాలని ఆ దేశ ప్రతినిధులు కోరినట్లు తెలిపారు. గుక్కెడు తాగునీటి కోసం ఇబ్బందులు పడ్డ ఈ గడ్డపై ఇవాళ మండుటెండలో చెరువులు నిండి మత్తడి దూకుతున్నాయని సంబురం వ్యక్తం చేశారు.

Medchal: గుండెపోటుతో బీటెక్ విద్యార్థి మృతి.. సీఎంఆర్ కాలేజీలో విషాదం

  • Read More Telangana News And Telugu News

Related Articles

Back to top button