2017లో వెంకటేష్ సరసన గురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దగుమ్మ. ఆ తర్వాత నీవెవరో, శివలింగ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె కార్ చిత్రంలో నటించింది
Feb 27, 2023 | 10:29 PM
2017లో వెంకటేష్ సరసన గురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దగుమ్మ. ఆ తర్వాత నీవెవరో, శివలింగ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
ప్రస్తుతం ఆమె కార్ చిత్రంలో నటించింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న రితిక సోషల్ మిడీయా ట్రోలింగ్స్ పై స్పందించింది. అవి తనను చాలా బాధపెట్టాయని ఆవేదన వ్యక్తం చేసింది.
రితిక సింగ్ మాట్లాడుతూ.. “సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్, ట్రోల్స్ ఎంతగానో బాధించాయి. డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో ఇవి నన్ను చాలా ఇబ్బందికి గురిచేసాయి. దీనితో నా గుండె పగిలిపోయింది.
అంతేకాకుండా నాకు ఓ ఫ్యామిలీ ఉంటుంది. నాకు పేరెంట్స్, బ్రదర్ ఉన్నారు. వాళ్లు కూడా ఇవి చూస్తే వారి హృదయం కూడా బద్దలవుతుంది.
ఆడవారికి అందరూ గౌరవం ఇవ్వాలి. ఒక సెలబ్రెటీ అయినా.. మిడిల్ క్లాస్ అమ్మాయి అయినా ఒకే రకమైన గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాను. మిడిల్ క్లాస్ అయినంత మాత్రాన మనం వారిని తక్కువగా చూడకూడదు” అంటూ చెప్పుకొచ్చింది రితిక.
Advertisement
అలాగే అమ్మాయిలకు కచ్చితంగా సెల్ఫ్ డిఫెన్సివ్ ఉండాలని.. ఇందుకోసం కాలేజీల్లో, స్కూల్లో వారానికి కనీసం ఒక్కసారైనా సెల్ఫ్ డిఫెన్సివ్ సంబంధించిన క్లాసులు జరగాలి అన్నారు.
ఈ విషయంలో తన తరపున ఎలాంటి సాయం చేసేందుకు అయిన ముందుంటానని అన్నారు. ప్రస్తుతం రితిక నటిస్తున్న కార్ చిత్రం మే 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.