News

green india challenge, ‘పిల్లల్ని పెంచిన చేతులు మొక్కల్ని పెంచితే ప్రకృతి పరవశించిపోతుంది’ – hyderabad mayor gadwal vijayalaxmi about green india challenge on womens day


సృష్టికి మూలం స్త్రీమూర్తి.. అలాంటి మహిళలు ఇప్పుడు ప్రకృతి పరిరక్షణకు నడుం బిగించాల్సిన అవసరమొచ్చిందన్నారు హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. మహిళలంతా ప్రకృతి పరిరక్షణ కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని.. మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. తన క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్లతో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పోస్టర్‌ను మేయర్ ఆవిస్కరించారు. పిల్లల్ని పెంచిన చేతులు మొక్కల్ని పెంచితే ప్రకృతి పరవశించిపోతుందని మేయర్ తెలిపారు. తమ పిల్లల్ని పెంచడంలో స్త్రీమూర్తులు చూపించే ప్రేమ, జాగ్రత్త అద్భుతమని.. అంతే ప్రేమతో మహిళాలోకం.. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు.

స్త్రీలు శక్తిస్వరూపులని.. వారు తాము తలపెట్టిన అన్ని కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేయగలరని మేయర్ తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉమెన్స్ డే ప్రత్యేక కార్యక్రమంలో ప్రతి మహిళ, విద్యార్థిని పాల్గొనేలా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూనే.. పుడమి బాగుకోసం అలుపెరగక కృషి చేస్తున్నారని తెలిపారు.

సాలుమారద తిమ్మక్కగారి స్పూర్తితో ప్రతి మహిళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మొక్కను నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం తరువాతి తరాల బాగు కోసం తలపెట్టిన నిస్వార్థమైన కార్యక్రమం అని కొనియాడారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మంచి ఆశయంలో ప్రతి మహిళా భాగస్వామి కావాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు.

Medchal: గుండెపోటుతో బీటెక్ విద్యార్థి మృతి.. సీఎంఆర్ కాలేజీలో విషాదం

  • Read More Telangana News And Telugu News

Related Articles

Back to top button