News

etela rajender on tspsc, ‘పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి మళ్లీ ప్రిపేరయ్యేందుకు ప్రభుత్వం రూ.లక్ష ఇవ్వాలి’ – bjp leader etela rajender comments on tspsc paper leak case


Authored by Ramprasad | Samayam Telugu | Updated: 18 Mar 2023, 3:17 pm

టీఎస్పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంపై హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. లీకేజీ వ్యవహారం బయటకురాగానే.. పరీక్ష రద్దు చేస్తున్నామంటూ ప్రకటించి.. సీఎం కేసీఆర్ సులువుగా తప్పించుకుంటున్నారని దుయ్యబట్టారు. పరీక్షల కోసం ఒక్కో అభ్యర్థి కోచింగ్ సెంటర్లలో లక్ష రూపాయలు ఖర్చు చేస్తున్నారని… ఇప్పుడు పరీక్షలు రద్దు చేసిన నేపథ్యంలో మళ్లీ ప్రిపేర్ అయ్యేందుకు ప్రతీ ఒక్కరికి లక్ష రూపాయలు ఇవ్వాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

 

eatala rajender
ఈటల రాజేందర్

ప్రధానాంశాలు:

  • టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారంపై గవర్నర్‌కు బీజేపీ నేతలు ఫిర్యాదు
  • రద్దు చేసిన పరీక్షలు వెంటనే నిర్వహించాలని డిమాండ్
  • విద్యార్థులు మళ్లీ ప్రిపేర్ అయ్యేందుకు లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్
తెలంగాణలో టీఎస్పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. TSPSCలో రద్దైన పరీక్షలు తక్షణమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. రద్దైన పరీక్షలు రాసిన ప్రతి విద్యార్థి మళ్లీ ప్రిపేర్ కావడానికి లక్ష రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని కోరారు. ఈ మొత్తం వ్యవహారానికి నైతిక బాధ్యత వహించి సీఎం కేసీఆర్ వెంటనే రాజీనామా చెయ్యాలన్నారు. టీఎస్పీఎస్సీ ప్రస్తుత బోర్డును రద్దు చేసి కొత్త బోర్డ్ ఏర్పాటు చెయ్యాలన్నారు. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను కలిసిన ఈటల రాజేందర్ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని కోరారు. కేసీఆర్ విద్యార్థుల కళ్లలో మట్టి కొట్టారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో విద్యార్థి కోచింగ్ సెంటర్లలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టారని ఈటల వివరించారు.

“పరీక్ష రద్దు చేస్తున్నా అని కేసీఆర్ సులువుగా తప్పించుకుంటున్నారు. కేసీఆర్‌కి రాజకీయాలు తప్ప తెలంగాణ ప్రజలపై పట్టింపు లేదు. అభ్యర్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దు. తెలంగాణ యువత బరిగీసి కొట్లాడాలి. ప్రభుత్వ మెడలు వంచుదాం. అభ్యర్థుల్లో ఆత్మవిశ్వాసం నింపాలని గవర్నర్‌ని కోరాం. ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది కేసీఆర్ ఆరాటం అంతా కుర్చీపైనే ఉంది. పెన్ డ్రైవ్‌లో పేపర్లు దొంగిలిస్తే టీఎస్పీఎస్సీ ఏం చేస్తుంది. సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయడం లేదు. రద్దైన పరీక్షలు తక్షణమే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం. పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి మళ్లీ ప్రిపేర్ కావడానికి లక్ష రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలి. విద్యార్థులు మనోధైర్యం కోల్పోవద్దు.” అని ఈటల తెలిపారు.

గవర్నర్‌కు ఫిర్యాదు

గవర్నర్‌కు ఫిర్యాదు

Rain Alert: అవసరమైతేనే బయటకు రండి.. భారీ వర్ష సూచన

  • Read More Telangana News And Telugu News

సమీప నగరాల వార్తలు

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Advertisement

Related Articles

Back to top button