Shaakunthalam Movie: ‘శకుంతల’ పాత్రకు ముందుగా సమంత అనుకోలేదు.. డైరెక్టర్ గుణశేఖర్ ఆసక్తికర కామెంట్స్..
కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా రూపొందిస్తోన్న ఈ చిత్రంలో శకుంతల పాత్రలో సమంత.. దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ కనిపించనున్నారు. ఏప్రిల్ 14న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా డైరెక్టర్ గుణశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహిస్తోన్న లేటేస్ట్ చిత్రం శాకుంతలం. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో మలయాళీ నటుడు దేవ్ మోహన్, ప్రకాష్ రాజ్, మోహన్ బాబు కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ బాలనటిగా కనిపించబోతుంది. ఈ సినిమాతోనే అర్హ సినీరంగంలోకి అడుగుపెడుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ క్యూరియాసిటిని పెంచేసింది. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా రూపొందిస్తోన్న ఈ చిత్రంలో శకుంతల పాత్రలో సమంత.. దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ కనిపించనున్నారు. ఏప్రిల్ 14న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా డైరెక్టర్ గుణశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
శాకుంతలం సినిమాలోని శకుంతల పాత్ర కోసం ముందుగా సమంతను అనుకోలేదని.. కానీ రంగస్థలం సినిమా చూశాకే ఈ పాత్ర కోసం సామ్ ను సంప్రదించినట్లు తెలిపారు. గుణశేఖర్ మాట్లాడుతూ.. “ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులకు సంవత్సర కాలం పట్టింది. షూటింగ్ కోసం ఆరు నెలల సమయం అనుకున్నాం. కానీ 81 రోజులు పట్టింది. ఆ తర్వాత ఏడాదిన్నర పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేశాం. అలా ఈ సినిమాను సిద్ధం చేయడానికి నాకు మూడేళ్లు పట్టింది.
అలాగే శకుంతలను కాళిదాసు ఎలా వర్ణించారనేది నేను చదివా. ఆ పాత్రకి ఎవరైతే బాగుంటుందని ఆలోచన చేశా.. మొదట సమంతను తీసుకోవాలని నేను అనుకోలేదు. సమంత అయితే బాగుంటుందని నా కూతురు చెప్పింది. ఆ సమయంలో మరోసారి రంగస్థలం సినిమా చూశాను. ఓ పాత్రలో సామ్ ఎంతగా ఒదిగిపోతుందనేది నాకు అర్ధమైంది. అప్పుడు ఆమెను సంప్రదించాను” అంటూ చెప్పుకొచ్చారు. ఈ సినిమా తెలుగుతోపాటు.. తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ఏప్రిల్ 14న విడుదల కానుంది.