News
devil, గ్రామానికి దెయ్యం పట్టిందని పూజలు.. అవాక్కవుతున్న యువకులు..! – superstitious worship in ramojipet of jagtial district
superstitious beliefs: ఒకపక్క అనంత విశ్వ రహస్యాలను ఛేదిస్తుంటే.. మరోపక్క మూఢనమ్మకాలతో కొందరు వింతవింత పనులు చేస్తున్నారు. సైన్స్తో సాధించలేనిది ఏదీ లేదని భావించే ఈ రోజుల్లో.. విష జ్వరాలు వస్తున్నాయని వింత ఆచారానికి తెరతీస్తున్నారు. తాజాగా.. జగిత్యాల జిల్లా రామోజీపేటలో.. విష జ్వరాలు వస్తన్నాయని పూజలకు పూనుకున్నారు. ఆ పూజల కోసం గ్రామ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడం కొస మెరుపు. ఈ తతంగాన్ని చూసిన అక్కడి యువకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
జగిత్యాల జిల్లా రామోజీపేటలో మూఢనమ్మకాలతో పూజలు
ప్రధానాంశాలు:
- జగిత్యాల జిల్లా రామోజీపేటలో వింత ఘటన
- గ్రామానికి దెయ్యం పట్టిందని ప్రజల పూజలు
- ఇంటికి రూ.500 వసూలు చేసిన గ్రామ పెద్దలు..!
జగిత్యాల జిల్లా రామోజీపేట గ్రామంలో కొన్ని రోజులుగా.. విష జ్వరాలతో పలువురు చనిపోయారు. అయితే.. వారు చనిపోవడానికి కారణం.. దెయ్యాలే (Devil) అని ఆ గ్రామంలోని కొందరు ప్రచారం మొదలు పెట్టారు. దెయ్యాల వల్లే గ్రామానికి అరిష్టం అంటుకుందని అనుకున్నారు. దానికి పరిష్కారంగా గ్రామంలో పూజలు చేయాలని నిర్ణయించారు. అందుకు గ్రామ ప్రజల నుంచి ఇంటికి రూ.500 చొప్పుల వసూలు చేశారని ప్రచారం జరుగుతోంది. అలా వసూలు చేసిన డబ్బుతో.. గ్రామ ప్రధాన కూడలి వద్ద పూజలు చేయించారు. ఈ పూజల వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో (Social Media) వైరల్ అయ్యాయి.
అయితే.. ఈ పూజల వ్యవహారంపై.. అక్కడి యువత అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ.. లాభం లేకుండా పోయింది. దీంతో.. పూజల తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు ఈ పూజల వ్యవహారం లోకమంతా తెలిసింది. ఇలాంటి పనులు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయొద్దని శాస్త్ర, సాంకేతిర జ్ఞానం ఉన్నవారు చెబుతున్నారు. దెయ్యాలు (Devil) అనేవి ఉండవని.. అది మూఢనమ్మకం అని.. ఇలాంటి ప్రచారం చేయొద్దు.. నమ్మొద్దని సూచిస్తున్నారు. అమాయక ప్రజలు ఇలాంటి వాటికోసం సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని చెబుతున్నారు.
సమీప నగరాల వార్తలు
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
Advertisement