News

dachepalli road accident, ఏపీలో రోడ్డు ప్రమాదం, ఆరుగురు మృతి.. బాధిత కుటుంబాలకు KCR రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన – cm kcr announced 5 lakh exgratia for dachepalli road accident victim families


Authored by Sundeep Poola | Samayam Telugu | Updated: 17 May 2023, 4:20 pm

KCR: ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా దాచేపల్లి రోడ్డు ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేసారు. తెలంగాణకు చెందిన ఆరుగురు కూలీలు మృతి చెందటం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

 

ప్రధానాంశాలు:

  • దాచేపల్లి ప్రమాదంపై సీఎం దిగ్ర్భాంతి
  • మృతుల కుటుంబాలకు సానుభూతి
  • రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటన
Dachepalli Accident: ఏపీలోని పల్నాడు జిల్లా దాచేపల్లి వద్ద ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టగా.. ఆరుగురు మృతి చెందారు. మరో 7 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా నల్గొండ జిల్లా దామరచర్ల మండలం నరసాపురం గ్రామానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు.

ఈ ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సీఎం సంతాపం ప్రకటించారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి ఒక లక్ష రూపాయలు ఎక్స్ గ్రేషియాను అనౌన్స్ చేశారు. గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య చికిత్సను అందించాలని స్థానిక మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావును సీఎం ఆదేశించారు.

పల్నాడు జిల్లాలో ఆటోను ఢీకొన్న లారీ

ప్రమాద సమయంలో ఆటోలో 23 మంది కూలీలు
ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో మెుత్తం 23 మంది కూలీలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన దాచేపల్లి ఏపీ, తెలంగాణకు మధ్య సరిహద్దు ప్రాంతం. నరసాపురంకు చెందిన మృతులు కూలీ పనుల కోసం నిత్యం ఏపీకి వెళ్తూ ఉంటారు. దాచేపల్లి మండలం పొందుగల వద్ద ఈ ఉదయం జరిగిన లారీ, ఆటో ప్రమాదంలో స్పాట్‌లోనే ఐదుగురు కూలీలు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్ర గాయాలతో గురజాల ఆసుపత్రిలో చేరారు. వారిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. దీంతో మృుతల సంఖ్య ఆరుకు చేరుకుంది. కూలీ పనుల కోసం వెళ్లే ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు మృతి చెందటంతో వారి గ్రామంలో విషాఛాయలు అలుముకున్నాయి.

  • Read More Telangana News And Telugu News

సమీప నగరాల వార్తలు

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Advertisement

Related Articles

Back to top button