News

Dachepalli Auto Accident, పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు – five killed and several injured in road accident near dachepalli palnadu district


Authored by Thirumala Babu | Samayam Telugu | Updated: 17 May 2023, 6:31 am

Pondugula Auto Accident నల్గొండ జిల్లా నుంచి కూలీలు పల్నాడు జిల్లాకు వస్తున్నారు.. పొందుగల దగ్గర ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం, ఏడుగురికి తీవ్ర గాాయాలు అయ్యాయి.

 

ప్రధానాంశాలు:

  • పల్నాడు జిల్లా దాచేపల్లి సమీపంలో ప్రమాదం
  • ఐదుగురు దుర్మరణం, ఏడుగురికి తీవ్ర గాయాలు
  • బాధితులంతా నల్గొండ జిల్లాకు చెందినవారు
Dachepalli Road Accident: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాచేపల్లి మండలం పొందుగల దగ్గర మిర్చీ కూలీలతో వెళుతున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో మొత్తం 23మంది ఉన్నారు. ఘటనలో గాయపడిన వారిని హుటా హుటిన గురజాల, మిర్యాలగూడ ఆస్పత్రులకు తరలించారు. వీరు మిర్చీ కూలీపనులకు వెళుతుండగా ప్రమాదం జరిగింది. వీరంతా నల్గొండ జిల్లా దామరచర్ల మండలం నరసాపురంకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన పొందుగల ప్రాంతం ఏపీ, తెలంగాణకు మధ్య సరిహద్దుగా ఉంది. ఈ ఆటో ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • Read Latest Andhra Pradesh News and Telugu News

సమీప నగరాల వార్తలు

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related Articles

Back to top button