News

Corn Cobs,మొక్కజొన్న పొత్తులను ఇష్టంగా తింటున్నారా.. శవాలను కాల్చిన బొగ్గులతో.. – is coal from burial ground using for corn cobs, viral video in telangana creates tension


మొక్కజొన్న పొత్తులను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుటుంటారు. అందులోనూ.. ఉడకబెట్టిన వాటికంటే.. బొగ్గులపై కాల్చిన కంకులంటే మరీ ఇష్టంగా తింటారు. మొక్కజొన్న పొత్తులు తింటే చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు చెప్తుండటంతో.. జనాలు కూడా అవి తినేందుకు ఆసక్తి ఎక్కువగా చూపిస్తుంటారు. పైగా.. మన దగ్గర రైతులు కూడా ఎక్కువగా మొక్కజొన్న పండిస్తుండటంతో విరివిగా దొరుకుతుంటాయి కూడా. అయితే.. వీటిని ఇష్టంగా తినే వాళ్లు.. వాటికి ఏ బొగ్గుల మీద కాలుస్తున్నారు.. ఏ నీళ్లలో ఉడకబెడుతున్నారు.. అన్న విషయాల గురించి ఎక్కువ పట్టించుకోరు. కానీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో మాత్రం మొక్కజొన్న ప్రియుల గుండెలను గుబెలుమనిపిస్తోంది.

ఓ వృద్ధుడు శ్మశానంలో నుంచి.. శవాలను కాల్చగా వచ్చిన బొగ్గులను ఓ సంచి నిండా నింపుకుని.. వెళ్తుండగా బైక్ మీద వెళ్తున్న ఓ వ్యక్తి గమనించాడు. అతన్ని ఆపి ఆ బొగ్గులను ఎక్కడికి తీసుకెళ్తున్నావు.. అంటూ నిలదీశాడు. ముందు సమాధానం చెప్పడానికి తడబడ్డాడు. కానీ.. ఆ వ్యక్తి గట్టిగా అడగటంతో తాత అనుమానంగానే నోరువిప్పాడు. ఈ బొగ్గులు కంకులు కాల్చేందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పడంతో వ్యక్తి.. అవాక్కయ్యాడు. నువ్వు కాల్చేందుకే తీసుకెళ్తున్నావా అని అడగ్గా.. మొక్కజొన్న పొత్తులు కాల్చేవారికి అమ్మడానికి తీసుకువెళ్తున్నట్లు సమాధానం ఇచ్చాడు.

అది విన్న ఆ వ్యక్తి.. ఇలా తీసుకెళ్లటం కరెక్ట్‌ కాదు కాదా.. ఇలా చేయటం వల్ల సమస్యలు వస్తాయి కాదా? అసలు శ్మశానంలో నుంచి బొగ్గులు తీసుకెళ్లటం ఏంటీ..? నిన్ను ఎవరు తీసుకెళ్లమన్నారు..? అంటూ వృద్ధునిపై వరుసగా ప్రశ్నలు కురిపించగా.. వాటిని ఏం సమాధానం చెప్పలేక అతను సైలెంట్‌గా వెళ్లిపోయాడు. సర్పంచ్, అధికారులకు ఫోన్ చేస్తా అంటూ బైక్ మీద ఉన్న వ్యక్తి బెదిరించటంతో.. ఆ వృద్ధుడు భయంతో వెనక్కి వెళ్లిపోయాడు. అయితే.. ఇందుకు సంబంధించిన వీడియో మొత్తం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే.. ఈ ఘటన తెలంగాణలో జరగ్గా.. ఎక్కడ జరిగిందన్నది స్పష్టంగా తెలియరాలేదు.

శ్మశానంలో బొగ్గులతో కంకులు కాలుస్తున్నారా..? వామ్మో.. ఏంది సామీ ఇది..!?

ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా.. ఇది చూసిన మొక్కజొన్న ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఇష్టంగా తింటున్న కంకులను ఇలాంటి బొగ్గులతో కాలుస్తున్నారా? అంటూ నోరెళ్లబెడుతున్నారు. అయితే.. ఇది ఓ వ్యాపారమా.. లేదా ఆ వృద్ధుడే అలా చేశాడా.. అన్నది తెలియాల్సి ఉంది. కాగా.. అన్ని చోట్లా ఇలా జరుగుతుందని మాత్రం చెప్పలేం. ఎంతైనా ఇలా చేయటం ప్రోత్సహించే విషయం కాకపోయినా.. ప్రతీ చోటా ఇలాగే చేస్తారనుకోవటం తప్పవుతుంది. ఎంతో మంది రైతులు.. పొట్టకూటి కోసం మొక్కజొన్న పొత్తులను కాల్చుకుంటూ జీవనం సాగిస్తుంటారు. అందరూ ఇలాంటి బొగ్గులనే వాడుతారని అనుకోలేం. కానీ.. ఇలాంటివి కంట పడితే మాత్రం కచ్చితంగా అడ్డుకోవాల్సిందే అంటూ నెటిజన్లు.. రకరకాలుగా స్పందిస్తున్నారు.

టెట్ పరీక్షలో ఘోర తప్పిదం.. ఒక పేపర్‌కు బదులు ఇంకో పేపర్.. 15 సెంటర్లలో ఇదే సీన్..!

Related Articles

Back to top button