cm jagan, సీఎం జగన్తో జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేలా కుచ్లర్ భేటీ! – germany consul general michaela kuchler met cm ys jagan mohan reddy
కాగా, విశాఖలో ఏపీ ప్రభుత్వం రెండు రోజుల పాటు ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (జీఐఎస్-2023)ను నిర్వహించిన విషయం విదితమే. 15 కీలక రంగాల్లో రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయని.. ఓవరాల్గా రూ. 13 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించినట్లు గతంలో సీఎం జగన్ వివరించారు. ఇక, పెట్టుబడులకు ముందుకొచ్చిన పారిశ్రామికవేత్తలకు సీఎం జగన్ అభినందనలు తెలిపారు. పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనలో ఆలస్యం చేయరాదన్నారు. తమ నుంచి పారిశ్రామికవేత్తకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. తాము చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నామని, పర్యావరణ హిత ఇంధన, శక్తి రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. పారదర్శక పాలనతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్లేందుకు పాటు పడుతున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్గా తీర్చి దిద్దడమే తమ లక్ష్యమని జీఐఎస్ విజయవంతం అయిన సందర్భంగా సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.