News

chillakallu police station, పోలీస్ స్టేషన్‌లో అవినీతి భాగోతం.. ఏసీబీ అధికారుల మెరుపుదాడి! – acb officers catch police who take bribe in ntr district


సామాన్య ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీస్ స్టేషన్‌లో అవినీతి భాగోతం బయటపడింది. ఎన్టీఆర్‌ జిల్లా చిల్లకల్లు పోలీస్‌ స్టేషన్‌పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోమవారం దాడి చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో రూ. 3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.అసలేం జరిగిందంటే..
చిల్లకల్లు పోలీస్‌ స్టేషన్‌లో గతంలో నమోదైన అక్రమ బొగ్గు రవాణా కేసు పెండింగ్‌లో ఉంది. ఈ కేసుపై గత నెల రోజులుగా విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్రమంగా బొగ్గు రవాణాకు పాల్పడ్డ వ్యక్తులు కేసు నుంచి తప్పించుకునేందుకు ఎస్సై దుర్గా ప్రసాద్‌కు రూ. 5 లక్షలు లంచం ఆశ చూపారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి దీనికి సంబంధించి రూ. 3 లక్షల నగదును చిల్లకల్లు టోల్‌గేటు వద్ద సదరు వ్యక్తుల నుంచి కానిస్టేబుల్ సునీల్‌ తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి పట్టుకున్నారు.

ఈ క్రమంలో కానిస్టేబుల్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా లంచం గురించి ఎస్సైని విచారించి నివేదిక తీసుకున్నారు. దీంతో ఉన్నతాధికారులు సైతం పోలీస్‌ స్టేషన్‌కు తరలివచ్చారు. ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే, అంతకుముందే మరో రూ.2 లక్షలను ఎస్సైకి అందజేసినట్లు బాధితులు చెబుతున్నారు.

కర్నూలు జిల్లా ఏ‌సి‌బి సోదాలు.. మహిళా అధికారి అక్రమాస్తులు

Related Articles

Back to top button