News
bus tour, Bandi Sanjay: పాత్రయాత్ర కాగానే ‘బండి’ బస్సుయాత్ర.. బీజేపీ వ్యూహం అదేనా..? – bjp chief bandi sanjay bas tour after praja sangrama yatra in telangana
Authored by Ramprasad | Samayam Telugu | Updated: 4 Dec 2022, 10:46 pm
Bandi Sanjay: బీజేపీ అధిష్ఠానం దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. గుజరాత్ ఎన్నికలు ముగియనుండటంతో.. ఫోకస్ మొత్తం సౌత్ స్టేట్స్ మీదనే పెట్టనుంది. అందులోనూ తెలంగాణపై మరింత ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. అందుకే.. ముందస్తు ఉహాగానాలు వస్తున్న వేళ.. ప్లాన్ మార్చినట్టు తెలుస్తోంది. పాదయాత్రలకు బదులుగా బస్సు యాత్ర చేపట్టనున్నట్టు సమాచారం. ప్రస్తుతం బండి సంజయ్ చేస్తున్న ఐదో విడత తర్వాత.. మరో పది రోజులు హైదరాబాద్లో నడిచి.. ఆ తర్వాత బస్సేక్కి ప్రజల్లోకి వెళ్తానంటున్నారు బండి సంజయ్.
ప్రధానాంశాలు:
- తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన బీజేపీ అధిష్ఠానం
- పాదయాత్ర అయిపోగానే బస్సుయాత్ర చేయనున్న బండి సంజయ్
- తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహం
అయితే.. ప్రస్తుతం ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్రలో బిజీగా ఉన్న బండి సంజయ్.. ఇది ముగిసిన వెంటనే హైదరాబాద్లో ఆరో విడత పాదయాత్ర చేయనున్నారు. ఆరో విడద పాదయాత్రను కేవలం 10 రోజుల్లోనే ముగించే విధంగా ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్నారు. ఇక అది కూడా ముగించుకుని.. కొత్త సంవత్సరంలో సంక్రాంతి తర్వాత బస్సుయాత్రను ప్రారంభించనున్నట్టు సమాచారం.
మరోవైపు.. బీజేపీ అధిష్ఠానం దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. గుజరాత్ ఎన్నికలు ముగియనుండటంతో.. ఫోకస్ మొత్తం సౌత్ స్టేట్స్ మీదనే పెట్టనుంది. అందులోనే ప్రత్యేకంగా తెలంగాణపై మాత్రం కొంత ఎక్కువ ఫోకసే పెట్టినట్టు సమాచారం. ఇక.. సోమ, మంగళవారాల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి డీకే అరుణ, ఎంపీ లక్ష్మణ్, మురళీధర్ రావు, పొంగులేటి హాజరుకానున్నారు.
- హైదరాబాద్ వాసులకు గుడ్న్యూస్.. ప్రారంభమైన మరో ఫ్లైఓవర్
- అగ్నికి ఆహుతై.. ప్రతి గుండెనూ రగిలించిన ఉద్యమ కాగడ.. శ్రీకాంతా చారి
- Read More Telangana News and Telugu News
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.