botsa satyanarayana, చంద్రబాబు కోర్టుల ముందు ముద్దాయిగా నిలబడాల్సిన పరిస్థితి: మంత్రి బొత్స – minister botsa satyanarayana allegations against tdp chief chandrababu naidu
కానీ, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ శాఖలో రూ. 330 కోట్ల దోపిడీ జరిగితే ఎందుకు కేంద్ర సంస్థల దర్యాప్తు కోరలేదని మంత్రి బొత్స ప్రశ్నించారు. ఈ కుంభకోణాన్ని జీఎస్టీ, ఈడీ సంస్థలు గుర్తించినా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. చంద్రబాబు ఈ స్కామ్లో ఉండబట్టే ఆయన దర్యాప్తు చేయించలేదని ఆరోపించారు.
ఇక, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ అన్నాక గెలుపోటములు సహజమేనని.. ఎక్కడ పొరబాటు జరిగిందో విశ్లేషించుకుంటామని తెలిపారు. తమ ప్రభుత్వం ఏ సెక్షన్ను ప్రభావితం చేయలేకపోయామనేది విశ్లేషించుకుంటామని పేర్కొన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి రెక్కల కష్టంతో పుట్టిన పార్టీ అని.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో వచ్చిందన్నారు. చంద్రబాబు లాగా మామను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కోలేదని వ్యాఖ్యానించారు.