bjp vote share in karnataka, Karnataka BJP: కన్నడ నాట బీజేపీకి తగ్గని ఓట్ షేర్.. కానీ 40 సీట్లు నష్టం.. కారణం ఇదే..! – bjp retained 2018 vote share of 36 percent but lost around 40 seats in karnataka assembly election 2023
2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకిక 36 శాతం ఓట్లు రాగా.. కాంగ్రెస్ పార్టీకి 38 శాతం ఓట్లు పడ్డాయి. జేడీఎస్కు 18 శాతం ఓట్లు వచ్చాయి. కానీ ఆ ఎన్నికల్లో కమలం పార్టీకి 104 సీట్లు రాగా.. కాంగ్రెస్ పార్టీ 80 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జేడీఎస్కు 37 సీట్లొచ్చాయి. వాస్తవానికి అంతకు ముందు ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ ఓటు శాతం 1.4 శాతం పెరిగింది. కానీ 2018లో కాంగ్రెస్ పార్టీ 42 సీట్లను కోల్పోయింది. గెలిచిన చోట ఎక్కువ మెజార్టీతో గెలిచి.. ఓడిన చోట తక్కువ తేడాతో ఓడటం వల్ల ఓట్లు ఎక్కువగా పడినప్పటికీ.. సీట్లు మాత్రం తగ్గాయి.
ఇప్పుడు బీజేపీ విషయంలోనూ అదే సీన్ రిపీట్ అయ్యింది. బీజేపీ ఈసారి కూడా సుమారు 36 శాతం ఓట్లను పొందింది. కానీ సీట్లు మాత్రం గణనీయంగా తగ్గాయి. ఆ పార్టీ ఏకంగా 40 సీట్లను కోల్పోవాల్సి వచ్చింది. కిట్టూరు కర్ణాటక ప్రాంతంలో 4 శాతం ఓటు బ్యాంకును కోల్పోయిన బీజేపీ.. బెంగళూరులో 6 శాతం ఓట్లను అధికంగా రాబట్టుకుంది. గతంతో పోలిస్తే జేడీఎస్ తనకు పట్టు్న్న పాత మైసూరు ప్రాంతంలో 8 శాతం ఓట్లను, ఓవరాల్గా దాదాపు 5 శాతం ఓట్లను నష్టపోయింది. ఇది కాంగ్రెస్కు కలిసొచ్చింది.
Party-wise Vote Share In Karnataka
2018తో పోలిస్తే కాంగ్రెస్ 5 శాతం ఓట్లు పడ్డాయి. గతంలో జేడీఎస్ వైపు మొగ్గు చూపిన ఓటర్లు ఈసారి రాజకీయ సుస్థిరత కోసం, బీజేపీకి ప్రత్యామ్నాయమైన కాంగ్రెస్కు ఓటేశారు. దీంతో హస్తం పార్టీకి 136 సీట్లు దక్కాయి. బీజేపీ బలహీన పడనప్పటికీ.. జేడీఎస్ ఓటు బ్యాంకు తమ వైపు మళ్లడం కాంగ్రెస్కు కలిసొచ్చింది. కాంగ్రెస్, జేడీఎస్కు కామన్ ఓటు బ్యాంక్ ఉండటమే దీనికి కారణం.
2014 ఏపీ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ, ఓడిన వైఎస్సార్సీపీ మధ్య తేడా కేవలం ఐదు లక్షల ఓట్లు మాత్రమే. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీకి 117 సీట్లు రాగా.. వైఎస్సార్సీపీ 70 సీట్లకే పరిమితమైంది. దీన్ని బట్టి ఓటు బ్యాంకులో స్వల్ప మార్పులొచ్చినా.. దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది కాబట్టి వచ్చే లోక్ సభ ఎన్నికల్లోనే కన్నడ నాట ఇదే సీన్ రిపీట్ అవుతుందని భావించలేం. ఎందుకంటే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 36 శాతం ఓట్లు పడగా.. 2019 లోక్ సభ ఎన్నికల్లో మోదీ చరిష్మాతో 51 శాతం ఓట్లు పడ్డాయి. ఆ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ నుంచి డీకే శివకుమార్ సోదరుడు మాత్రమే గెలుపొందారు.