News
bandi sanjay, కేసీఆర్కు మన దేశంలో ఉండే అర్హత లేదు: బండి సంజయ్ – bjp state president bandi sanjay comments on cm kcr in hyderabad
Authored by Ramprasad | Samayam Telugu | Updated: 26 Jan 2023, 12:54 pm
హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. జెండా ఎగరేశారు. అనంతరం ప్రసంగించిన బండి సంజయ్.. సీఎం కేసీఆర్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అంబేడ్కర్ అందించిన రాజ్యాంగాన్ని అవమానించిన కేసీఆర్కు దేశంలో ఉండే అర్హత లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్.
ప్రధానాంశాలు:
- బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రిపబ్లికే డే వేడుకలు
- జెండా ఆవిష్కరించిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
- సీఎం కేసీఆర్ మీద తీవ్ర విమర్శలు గుప్పించిన బండి
మరోవైపు.. తెలంగాణ సర్కారుపై బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంబేడ్కర్, గవర్నర్, రాజ్యాంగం, కోర్టులు, మహిళలకు కేసీఆర్ గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించారు. పరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను కేసీఆర్ ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ నిజాం పోకడలను అవలంభిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగిస్తున్నారన్నారు. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేయాలని అనుకుంటున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని అవమానించిన కేసీఆర్కు దేశంలో ఉండే అర్హత లేదని మండిపడ్డారు.
- ఇంద్రభవనాన్ని తలపిస్తోన్న కొత్త సెక్రటేరియట్.. మతిపోగొడుతోందిగా..!
- Read More Telangana News And Telugu News
సమీప నగరాల వార్తలు
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.