News
atchannaidu, ఏపీలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా టీడీపీకి వచ్చే ఎమ్మెల్యే సీట్లివే.. ఊహించని నంబర్: అచ్చెన్న – tdp leader atchannaidu inaugurated ntr statue
చివరికి పేపర్, టీవీ తనకు లేదని సీఎం జగన్ అబద్ధాలు ఆడుతున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. రూ. 510 కోట్ల ఆస్తి ఉన్న సీఎం జగన్ పేద ముఖ్యమంత్రా? అని అచ్చెన్న ప్రశ్నించారు. ఇక, రూ. 2 వేల నోట్లను ఎలా మార్చాలో తెలియక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కంగారు పడుతున్నారని విమర్శించారు. సీఎం జగన్ రూ.10 లక్షల కోట్లు అప్పు చేశారని.. రూ. 3 లక్షల కోట్లు ప్రజలపై పన్నుల భారం వేశాడని దుయ్యబట్టారు. నాలుగేళ్ల పరిపాలనలో వైసీపీ ప్రభుత్వం ఎక్కడైనా భవనం, రోడ్డు వేసిందా? అని ప్రశ్నించారు.
ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ.. బలహీనవర్గాల ప్రజలకు ఎన్టీఆర్ అండగా నిలిచారని గుర్తు చేశారు. ఎందరో నాయకులను సమాజానికి అందించిన ఘనత ఎన్టీఆర్దే అని కొనియాడారు. ఆత్మాభిమానం గల ఎన్టీఆర్ వారసులుగా ఎవరికీ తలవంచమని చెప్పారు. సైకో పరిపాలనలో రాష్ట్ర ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో చరిత్రను తిరగరాస్తామని తెలిపారు. 2024 ఎన్నికల్లో ప్రజలు వైసీపీపై తిరగబడటం ఖాయమన్నారు.